AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Zonal System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా స్థానిక (లోకల్) క్యాడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చేపడుతూ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు అంచెల కమిటీలను ఏర్పాటు చేసింది.. జిల్లా, శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లా కమిటీకి పాత జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించగా, కొత్త జిల్లాల కలెక్టర్లు కో-చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ, వ్యక్తిగత ప్రాధాన్యతలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని క్యాడర్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రత్యేక వర్గాల ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, వితంతువులు, అలాగే క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ లేదా లివర్ మార్పిడి చేయించుకున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో ఆరోగ్య, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు క్యాడర్లలో నిష్పత్తి ప్రకారం సమాన పంపిణీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. SC గ్రూప్-1కు 1 శాతం, గ్రూప్-2కు 6.5 శాతం, గ్రూప్-3కు 7.5 శాతం, STలకు 6 శాతం మేర కేటాయింపులు ఉండనున్నాయి.
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు..
ఉద్యోగుల నుంచి తప్పుడు సమాచారం అందితే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఒకసారి ఉద్యోగి తన ఆప్షన్ నమోదు చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న స్పౌస్ కేసుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల కేటాయింపులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడు రోజులలోపు సంబంధిత సచివాలయ కార్యదర్శికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?