AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP New Zonal System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా స్థానిక (లోకల్) క్యాడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చేపడుతూ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు అంచెల కమిటీలను ఏర్పాటు చేసింది.. జిల్లా, శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లా కమిటీకి పాత జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించగా, కొత్త జిల్లాల కలెక్టర్లు కో-చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ, వ్యక్తిగత ప్రాధాన్యతలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని క్యాడర్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రత్యేక వర్గాల ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, వితంతువులు, అలాగే క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ లేదా లివర్ మార్పిడి చేయించుకున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో ఆరోగ్య, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు క్యాడర్లలో నిష్పత్తి ప్రకారం సమాన పంపిణీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. SC గ్రూప్-1కు 1 శాతం, గ్రూప్-2కు 6.5 శాతం, గ్రూప్-3కు 7.5 శాతం, STలకు 6 శాతం మేర కేటాయింపులు ఉండనున్నాయి.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు..
ఉద్యోగుల నుంచి తప్పుడు సమాచారం అందితే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఒకసారి ఉద్యోగి తన ఆప్షన్ నమోదు చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న స్పౌస్ కేసుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల కేటాయింపులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడు రోజులలోపు సంబంధిత సచివాలయ కార్యదర్శికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!