Shobha Karandlaje: వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు మరెన్నో ఇతర దేశాలకు ఎగుమతి చేశాం. ఎన్నో లక్షలమందిని కాపాడాం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 120 కోట్ల రూపాయలు కేటాయించాం అన్నారు కేంద్రమంత్రి. ఇక్కడ వైద్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో ఆరు ఎయిమ్స్ ఆసుపత్రుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చామన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ఈ కార్యక్రమంలో ఎన్ వై కె నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్డీఓ మధుసూదన్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రాజగోపాల్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 195.19 కోట్ల టీకా డోసులు వేశారు. 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో ఇప్పటి వరకు ఇచ్చిన మొదటి డోసు టీకాలు 3.51 కోట్లు. ప్రస్తుత యాక్టివ్ కేసులు 47,995. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం 6594 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!