Andhra Pradesh: సీపీఎస్ సమావేశాన్ని బహిష్కరించిన ఏడు ఉద్యోగ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అమరావతి సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశమైంది. బ్లాక్ 2లో ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి, ఇతర నేతలు సీపీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా ఏడు సంఘాలు దూరంగా ఉన్నాయి.
అటు APCPSEA రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, కె.పార్థసారథి మాట్లాడుతూ.. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ సీపీఎస్పై చర్చలను బహిష్కరించామని తెలిపారు. జీపీఎస్పై గత కొన్ని నెలలుగా రాష్ట్రప్రభుత్వం చర్చలు పేరుతో సమస్యను సాగతీస్తుందని ఆరోపించారు. గత చర్చలలో పాత పెన్షన్ పునరుద్ధరణ మాత్రమే తమకు అంగీకారం అని రాతపూర్వకంగా తెలిపామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమావేశం పెట్టడం సమంజసం కాదన్నారు. ఒక వైపు సెప్టెంబర్ 1వ తేదీ మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను తక్షణం తొలగించాలని అప్పలరాజు, కె.పార్థసారథి డిమాండ్ చేశారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
Read Also: North Korea: సినిమాలు చూసిన పాపానికి.. మైనర్లకు మరణశిక్ష
అటు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ.. సీపీఎస్తో పాటు పెండింగ్ అంశాలపై చర్చ ఉందని జీఏడీ కార్యదర్శి నుంచి మెసేజ్ రావటంతోనే సమావేశానికి వచ్చామన్నారు. కొత్త డీఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు హెల్త్ స్కీం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పదవీ విరమణ 62 ఏళ్ళకు పెంచటం అనే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఓపీఎస్ అయితేనే చర్చిస్తామని.. జీపీఎస్పై చర్చించేది లేదన్నారు. ఈ సమావేశంలో 12వ పీఆర్సీ కమిటీ ప్రకటన కూడా కోరతామన్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!