Andhra Pradesh: సీపీఎస్ సమావేశాన్ని బహిష్కరించిన ఏడు ఉద్యోగ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అమరావతి సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశమైంది. బ్లాక్ 2లో ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి, ఇతర నేతలు సీపీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా ఏడు సంఘాలు దూరంగా ఉన్నాయి.
అటు APCPSEA రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, కె.పార్థసారథి మాట్లాడుతూ.. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ సీపీఎస్పై చర్చలను బహిష్కరించామని తెలిపారు. జీపీఎస్పై గత కొన్ని నెలలుగా రాష్ట్రప్రభుత్వం చర్చలు పేరుతో సమస్యను సాగతీస్తుందని ఆరోపించారు. గత చర్చలలో పాత పెన్షన్ పునరుద్ధరణ మాత్రమే తమకు అంగీకారం అని రాతపూర్వకంగా తెలిపామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమావేశం పెట్టడం సమంజసం కాదన్నారు. ఒక వైపు సెప్టెంబర్ 1వ తేదీ మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను తక్షణం తొలగించాలని అప్పలరాజు, కె.పార్థసారథి డిమాండ్ చేశారు.
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
Read Also: North Korea: సినిమాలు చూసిన పాపానికి.. మైనర్లకు మరణశిక్ష
అటు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ.. సీపీఎస్తో పాటు పెండింగ్ అంశాలపై చర్చ ఉందని జీఏడీ కార్యదర్శి నుంచి మెసేజ్ రావటంతోనే సమావేశానికి వచ్చామన్నారు. కొత్త డీఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు హెల్త్ స్కీం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పదవీ విరమణ 62 ఏళ్ళకు పెంచటం అనే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఓపీఎస్ అయితేనే చర్చిస్తామని.. జీపీఎస్పై చర్చించేది లేదన్నారు. ఈ సమావేశంలో 12వ పీఆర్సీ కమిటీ ప్రకటన కూడా కోరతామన్నారు.
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!