Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ను కలిసిన ‘సేవ్ దేశీ కౌస్’ క్యాంపెయినర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వివరించారు.
విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి హైబ్రిడ్ జాతులతో కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశీ ఆవు జాతులు ఎన్నో అంతరించి పోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సీఎం జగన్కు అల్లోల దివ్యారెడ్డి వివరించారు. మన దేశ మేలు రకమైన ఆవులను అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు పెంచి పోషిస్తే.. మనం మాత్రం అధిక పాల దిగుబడి కోసం హైబ్రిడ్ జాతుల పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాసిరకం పాలు మన పిల్లలకు ఇస్తున్నామని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అరికట్టాలని, స్వదేశీ జాతుల అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశీ ఆవుల ఉనికే ప్రమాదంలో పడిందని, క్రాస్ బ్రీడింగ్ పద్దతుల నివారణకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. తాను సుప్రీం కోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, ఈ పిల్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ లు జారీ చేసిందని సీఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించి దేశవాళీ అవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ చెప్పారని అల్లోల దివ్యా రెడ్డి తెలిపారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
Read Also: ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత సైజ్లో ఉండాలి?
అటు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని కూడా అల్లోల దివ్యారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దేశీ జాతి ఆవులను సంరక్షించాలనే లక్ష్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టామని.. దీనికి మద్దతు నివ్వాలని భారతిని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వచ్ఛమైన ఏ2 మిల్క్ను అందించాలనే ఉద్దేశంతో పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో పని చేస్తున్నట్లు ఆమెకు వివరించారు. కాగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం అల్లోల దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని వైఎస్ భారతి అభినందించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!