Seediri Appalaraju : హాస్టల్ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్లో చర్చించారా.? కనీసం సబ్ కమిటీ వేశారా.?
- నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం వెళ్తుంది
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు, డాక్టర్స్ బయటకొస్తున్నారు
- ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి
- హాస్టల్ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్లో చర్చించారా.?
- కనీసం సబ్ కమిటీ వేశారా.? -సీదిరి అప్పలరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆపేశారని అప్పలరాజు చెప్పారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్లు కూడా సేవలను నిలిపివేశాయన్నారు. అదనంగా, ఈ హాస్పిటల్లకు ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. మెడికల్ కాలేజీలను అమ్మి ప్రైవేట్ పరంగా మార్చడం ఒక పెద్ద తప్పని, ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య అందించడమే ముఖ్యమైన అవసరం అని అన్నారు. అలాగే, 108, 104 ఆంబులెన్స్ సేవలు కనపడటంలేదని, హెల్త్ ఎమర్జెన్సీ స్థాయికి చేరుకున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కేవలం భూమి కేటాయింపుల పై మాత్రమే మించినట్లు, ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. “హెల్త్ మినిస్టర్ మీడియా ముందు చిల్లర మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ వ్యవస్థ పరంగా పనులు జరగడం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!