Sajjala Ramakrishna Reddy: జగన్వి విప్లవాత్మక సంస్కరణలు.. రాజకీయ సాధికారత దిశగా అడుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు.. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన సభ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ తరఫున సీఎం జగన్ ఎంపిక చేశారు. మొత్తం 18 స్థానాలకు సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారు. 18 స్థానాల్లో 14 స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని గుర్తుచేశారు. రాజకీయ సాధికారత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని.. జగన్ విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని అభినందించారు.. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేశారు. శాసన మండలి నుంచి శాసన సభ వరకు కీలక పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
Read Also: Chitram Chudara: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్!
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇన్ని పదవులు ఎందుకు ఇవ్వలేదు..? అంటూ నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇవ్వని వ్యక్తి.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయాలని సీఎం సంకల్పించారు. మహిళలకు సైతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా అడుగులు వేశారని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇదే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయబోతున్నాం అని ప్రకటించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, ఏపీలో ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!