RK Roja : గత 15 నెలలుగా రైతులకు నరకం చూస్తున్నారు…
- రైతుల నరక జీవితం కూటమి పాలనలోనే
- యూరియా కోసం వలస వెళ్ళాల్సిన రైతులు
- చేతకాకపోతే కూటమి దిగిపోవాలి
- రైతులకు అండగా వైసీపీ పోరాటం కొనసాగుతుంది- రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja : తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత 15 నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజా మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు గడిచినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి సహాయం చేయలేదు” అని అన్నారు. యూరియా కొరతను చూపిస్తూ టిడిపి నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు.
Dinesh Karthik: ధోనీ వల్లే నాకు అవకాశాలు రాలేదు.. దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
నగరి పరిసరాల్లో రైతులకు యూరియా అందకపోవడంతో తమిళనాడు, ప్రొద్దుటూరుకు వెళ్ళి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. “వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నమ్మి రైతులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు” అని వ్యాఖ్యానించారు. మామిడి, చీని, వరి, మిర్చి, పోగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.
“ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతు సమస్యలు పరిష్కరించే సామర్థ్యం లేకపోతే, వారు దిగిపోవాలి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు” అని రోజా పేర్కొన్నారు. ఇసుక, మద్యం, భూములు, బదిలీలు దోచుకుంటున్నారని, లోకేష్, పవన్ కల్యాణ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వీరు యూరియాను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని రైతులను దోచుకున్నారు” అని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతూనే కేంద్రానికి లేఖ ఎందుకు రాసిందని ప్రశ్నించారు. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా యూరియా రైతులకు ఎందుకు తీసుకురాలేకపోయారు?” అని మండిపడ్డారు. చివరగా రోజా మాట్లాడుతూ, “రైతులకు ఎల్లప్పుడూ అండగా వైసీపీ నిలుస్తుంది. రైతుల కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
Kakani Govardhan Reddy : యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం
తాజావార్తలు
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!