RK Roja : గత 15 నెలలుగా రైతులకు నరకం చూస్తున్నారు…
- రైతుల నరక జీవితం కూటమి పాలనలోనే
- యూరియా కోసం వలస వెళ్ళాల్సిన రైతులు
- చేతకాకపోతే కూటమి దిగిపోవాలి
- రైతులకు అండగా వైసీపీ పోరాటం కొనసాగుతుంది- రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja : తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత 15 నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజా మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు గడిచినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి సహాయం చేయలేదు” అని అన్నారు. యూరియా కొరతను చూపిస్తూ టిడిపి నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు.
Dinesh Karthik: ధోనీ వల్లే నాకు అవకాశాలు రాలేదు.. దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
నగరి పరిసరాల్లో రైతులకు యూరియా అందకపోవడంతో తమిళనాడు, ప్రొద్దుటూరుకు వెళ్ళి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. “వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నమ్మి రైతులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు” అని వ్యాఖ్యానించారు. మామిడి, చీని, వరి, మిర్చి, పోగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.
“ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రైతు సమస్యలు పరిష్కరించే సామర్థ్యం లేకపోతే, వారు దిగిపోవాలి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు” అని రోజా పేర్కొన్నారు. ఇసుక, మద్యం, భూములు, బదిలీలు దోచుకుంటున్నారని, లోకేష్, పవన్ కల్యాణ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వీరు యూరియాను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని రైతులను దోచుకున్నారు” అని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతూనే కేంద్రానికి లేఖ ఎందుకు రాసిందని ప్రశ్నించారు. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా యూరియా రైతులకు ఎందుకు తీసుకురాలేకపోయారు?” అని మండిపడ్డారు. చివరగా రోజా మాట్లాడుతూ, “రైతులకు ఎల్లప్పుడూ అండగా వైసీపీ నిలుస్తుంది. రైతుల కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
Kakani Govardhan Reddy : యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం
తాజావార్తలు
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!