Kakani Govardhan Reddy : యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం
- నెల్లూరులో వైసీపీ నేతల ర్యాలీ, కలెక్టరేట్ దాకా వినతిపత్రం
- యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం ఆరోపణ
- రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శ
- కమిషన్ల కోసమే ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని ఆరోపణ
Kakani Govardhan Reddy : నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరారు.
vaccine: మలేరియా రహిత దేశంగా.. త్వరలో వ్యాక్సిన్ విడుదల
Also Read
జిల్లా జేసీకి వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందజేశామని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం కేంద్రం నుంచి తీసుకొచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతం కంటే ఎక్కువ యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
యూరియా పంపిణీ వ్యవహారంలో రూ.200 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేయలేదని కాకాణి విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం కాకుండా వ్యాపారులు లాభాలు పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కమిషన్ల కోసమే నోట బనకచర్ల ప్రాజెక్ట్ను ప్రస్తావిస్తున్నారని కాకాణి ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
Karnataka: కర్ణాటకలో ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!