Kakani Govardhan Reddy : యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం
- నెల్లూరులో వైసీపీ నేతల ర్యాలీ, కలెక్టరేట్ దాకా వినతిపత్రం
- యూరియా పంపిణీలో రూ.200 కోట్లు స్కాం ఆరోపణ
- రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శ
- కమిషన్ల కోసమే ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy : నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరారు.
vaccine: మలేరియా రహిత దేశంగా.. త్వరలో వ్యాక్సిన్ విడుదల
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
జిల్లా జేసీకి వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందజేశామని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం కేంద్రం నుంచి తీసుకొచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతం కంటే ఎక్కువ యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
యూరియా పంపిణీ వ్యవహారంలో రూ.200 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేయలేదని కాకాణి విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం కాకుండా వ్యాపారులు లాభాలు పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కమిషన్ల కోసమే నోట బనకచర్ల ప్రాజెక్ట్ను ప్రస్తావిస్తున్నారని కాకాణి ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
Karnataka: కర్ణాటకలో ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!
తాజావార్తలు
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..