Robbery in Prakasam District: పొదిలిలో దారి దోపిడీ.. అటు వెళ్లాలంటేనే హడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన దారిదోపిడీ సంచలనంగా మారింది. హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే అనుకుని రామాపురం వెళ్లే గురుగుపాడు మట్టిరోడ్డులో దారి దోపిడీకి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి సమయాలలో గురుగుపాడు గ్రామానికి వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తు తెలియని ముఠాపై పలువురు ఆరోపిస్తున్నారు ఆటో ఆపి ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని బెదిరించడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు బాధితుడు.
అయితే, అతని దగ్గర నగదు లేకపోవడంతో బాధితుడిని వదిలేసారు దుండగులు. దారిదోపిడీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడేం జరిగిందనేది ఆరాతీస్తున్నారు. ఈ ఘటనతో వాహనదారులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు.ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి దారి దోపిడీ బెదిరింపులకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. వాహనదారులపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని పలువురు పోలీసులకు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలంటున్నారు.
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
Read ALso: Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
కడియద్ద బాధితులకు చెక్కుల పంపిణీ
ఈ నెల 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు కుటుంబానికి 10లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందచేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రమాదం జరిగి వారం రోజులు నిండకుండానే బాధితులను ఆదుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యం అయింది.
తాజావార్తలు
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
-
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
-
Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!