RK Roja: పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు..
- కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీమంత్రి ఆర్కే రోజా..
- సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు..
- పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు: ఆర్కే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: నాలుగో సారి సీఎంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు అని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇప్పుడు ఏదో మొదలు పెట్టారు.. మాట్లాడితే జగన్ బెంగుళూరు వెళ్తున్నారు అంటున్నారు.. గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించింది. శుక్రవారం అయితే హైదరాబాద్ కి వెళ్లి పోతున్నారు.. మీరు హైదరాబాద్ లో ఉండటం వల్లే వరదలకు విజయవాడ మునిగి పోయింది.. అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్ లో తిరుగుతున్నారని జనాలు నవ్వుకుంటున్నారు.. ఇక, చంద్రబాబు తన కేసులపై విచారణ ముందు చేయించుకోవాలి.. కుంటి సాకులతో కేసుల నుంచి బయటకు వచ్చారంటూ వైసీపీ నేత ఆర్కే రోజా పేర్కొనింది.
Read Also: Vivo T4 5G: మిడ్ రేంజ్లో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలైన వివో T4 5G
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ఇక, అమరావతిని దోచుకోవాలని అనుకున్న చంద్రబాబుపై ప్రధాని మోడీ విచారణ చేయించాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. ప్రధాని తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. అయితే, వైజాగ్ ను రాజధాని చేయాలని జగన్ కలలు కన్నారు.. పరిపాలన రాజధాని చేస్తే వైసీపీ వల్ల అరాచకాలు చేస్తారని భయ పెట్టారు.. వైజాగ్ లో 60 రోజుల ముందు పుట్టిన ఉర్సా కంపెనీకి మూడు వేల కోట్ల భూములు దారాదత్తం చేశారు.. దావోస్ లో వీళ్లకు ఒక్క ఎంఓయూ కూడా కాలేదు.. హైదరాబాద్ లో వీళ్ళు ఇచ్చిన కంపెనీకి బోర్డులు, అడ్రస్ లు కూడా లేవు.. టీడీపీకి చెందిన ఓ ఎంపీ స్నేహితుడి కంపెనీకి ఎకరాలకు ఎకరాల భూములు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇబ్బందులపై వైసీపీ అండగా నిలబడుతుంది అని మాజీ మంత్రి రోజా తెలిపింది.
Read Also: Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు ప్రపంచ స్థాయి అవార్డు
అలాగే, హిందువులు పూజించే గోమాతలు మృతి చెందుతున్నప్పటికీ చంద్రబాబు ఒప్పుకోవటం లేదు అని వైసీపీ నేత రోజా అన్నారు. ఇప్పటికే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. ఈ ఏడాదిలో తిరుమలలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి.. చెప్పులు వేసుకుని గుళ్ళకు వస్తున్నారు.. తిరుమలలో ఏం జరుగుతుందో కూడా చూడాలని సూచించింది. శ్రీకూర్మంలో అన్నీ తాబేళ్లు చనిపోతున్నా పట్టించుకోవటం లేదు.. ప్రజలకు మంచి చేయటానికి వీళ్లకు టైం లేదు.. ఇక, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించింది. బీజేపీ వాళ్ళు ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు సరిదిద్దటం లేదు.. కూటమిలో ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా సమర్థిస్తారా అని ఆర్కే రోజా అడిగింది.
Read Also: YS Jagan: యుద్ధ వాతావరణంలోనే వైసీపీ పుట్టింది.. ఆ తర్వాత కూడా యుద్ధమే..!
కాగా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా.. ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించింది. ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో వీళ్ళ కుట్రలపై మాట్లాడుతున్నారు కాబట్టే కేసులు పెట్టారని పేర్కొనింది. ఆయనపై ఏ ప్రాతిపదికన విచారణ చేస్తున్నారో అర్ధం కావటం లేదు.. జగన్ స్కీములు మాత్రమే చేశారు.. జగన్ బటన్లు నొక్కితే అవినీతి జరిగే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. అయితే, చంద్రబాబు ప్రస్తుతం దోచుకునే పనులు చేస్తున్నారు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు.. వీటి వల్ల మద్యం మత్తులో దాడులు కూడా పెరిగాయి.. ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!