Andhra Pradesh: ఈనెల 5న కర్నూలులో ‘రాయలసీమ గర్జన’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం అన్నది చారిత్రాత్మక అవసరమని.. అంతేకాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి ఇది అత్యంత ఆవశ్యకమని నాన్ పొలిటికల్ జేఏసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
Read Also: Droupadi Murmu: ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
1937లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఏపీ హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాల్సి ఉందని నాన్ పొలిటికల్ జేఏసీ గుర్తుచేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన నిర్వహిస్తున్నామని రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ కన్వీనర్ వై.జయరాజు వెల్లడించారు. లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి అనుగుణంగా నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విశాఖలో నిర్వహించిన సభను తలదన్నేలా రాయలసీమ గర్జన నిర్వహించనున్నారు. రాయలసీమ గర్జన కార్యక్రమానికి వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, చట్టసభల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు ఆవిష్కరించారు. కాగా గతంలో కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండేది. ఇప్పుడు మరోసారి ఏపీకి న్యాయరాజధానిగా మారబోతుందని వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు.
కాగా రాష్ట్రంలో టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టును కర్నూలు తరలించేందుకు సంపూర్ణ సమ్మతి తెలియజేసినందున రాజకీయ ఇబ్బందులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశానికి ఆమోదముద్ర వేయాలని నాన్ పొలిటికల్ జేఏసీ కోరుతోంది. ఈ సమావేశంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..