Visakhapatnam: కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన.. రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ
Visakhapatnam: కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం పైన విచారణ ప్రారంభమైంది. కాగా విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మొదటగా డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ డిపార్ట్మెంట్ ల సిబ్బంది హాజరు అయ్యారు. విచారణ సమయంలో లోకో పైలట్లు వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి విచారణ అధికారులకు విన్నవించుకున్నారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరు, లోకో పైలట్లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి విచారణ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. కాగా రేపు మరి కొంతమంది సాక్షులను రైల్వే సేఫ్టీ అధికారులు విచారించనున్నారు.
Read also:Governor Abdul Nazeer: ప్రజల మనసు గెలిచిన మహానేత వైఎస్ఆర్
Also Read
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా లోని అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగిఉన్న రైలు ను వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది.ఈ ఘటనలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. దీనితో ఆ 5 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో 14 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యల్లో మంత్రి బొత్సా సత్యనారాయణ, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకి సమీప జిల్లాలు అయినా విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read also:Exit Poll: నవంబర్ 30 సాయంత్రం 6.30 వరకు.. ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం..
అయితే ప్రస్తుతం మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాగా రైలు ప్రమాద మృతుల్లో నలుగురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు. రాయగడ పాసింజర్ లో పైలట్ మధు సూధన రావ్ తో పాటు అసిస్టెంట్ లోకో పైలట్ చిరంజీవి కూడా ఘటనా స్థలం లోనే మృతి చెందారు. అలానే పలాస పాసింజర్ గార్డ్ ఎం శ్రీనివాస్ రావ్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న రైల్వే గాంగ్ మెన్ కృష్ణం నాయుడు కూడా మరణించారు.
తాజావార్తలు
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
-
Vinesh Phogat: బ్రిజ్ భూషణ్ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!
-
AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
-
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!