Chad: చాద్లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
60 killed in anti-government protests in Chad: చాద్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మిన్నంటుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డేబీ తన అధికారాన్ని రెండేళ్ల పాటు పొడగించుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం దేశంలోని రెండు అతిపెద్ద నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎగిసిపడ్డాయి. చాద్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 60 మంది మరణించారు.
Read Also: Langer Houz Crime: బాత్రూమ్ లో పేలిన గీజర్… ఇద్దరు డాక్టర్లు మృతి
Also Read
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ఫ్రాన్స్ తో పాటు ఇతర ఆఫ్రికన్ యూనియన్ దేశాలు చాద్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఆమ్నేస్టి ఇంటర్నేషనల్, నిరసనకారులపై ప్రభుత్వం అణిచివేతను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. చట్టవిరుద్ధంగా హత్యలు చేసి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాని ప్రభుత్వాన్ని కోరింది. రాజధాని ఎన్ జమెనాలో 30 మంది మరణించినట్లు చాడ్ ప్రభుత్వం అధికార ప్రతినిధి అజీజ్ మహమత్ సలే తెలిపారు. అయితే నిరసన కారులు మాత్రం 40 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నారు. అనేక మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయని అన్నారు. చాద్ లో రెండో పెద్ద నగరం అయిన మౌండౌలో మరో 32 మంది నిరసనకారులు ప్రభుత్వ కాల్పుల్లో మరణించారు. దక్షిణ చాద్ లోని దోబా, సర్హ్ పట్టణాలకు కూడా నిరసనలు పాకాయి.
18 నెలల క్రితం తండ్రి హత్య నేపథ్యంలో ఇద్రిస్ డేబీ బాధ్యతులు తీసుకున్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా ఆయన చాద్ ను పాలిస్తున్న క్రమంలో అప్పటి అధ్యక్షుడు ఇద్రిస్ డేబీ ఇట్నో ఎప్రిల్ 2021లో తిరుగుబాటుదారుల చేతిలో చనిపోయారు. ఆ తరువాత ప్రస్తుతం పాలకుడు తన పదవిని రెండేళ్లు పెంచుకోవడంతో నిరసనలు చెలరేగాయి. రాజధాని గురువారం తెల్లవారుజాము నుంచే ప్రజలు నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ దళాలతు కాల్పులు జరిపాయి. మరణించిన వారిలో చాడియన్ జర్నలిస్ట్ నార్సిస్ ఓరెడ్జే ఉన్నారు. చాద్ లో నిరసనకారులపై కాల్పులు జరపడం ఇదే తొలిసారికాదు. 2021,2022 లో జరిగిన ఘటనల్లో కూడా అక్కడి దళాలు ప్రజలపై కాల్పులు జరిపాయి.
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!