Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని మరోసారి హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ..
Read Also: CM YS Jagan: పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం.. వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు..
Also Read
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
కాగా, ఏపీలో తన పాదయాత్రలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. మూడు రాజధానుల ఆలోచన సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు, అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు రాహుల్.. కాగా, ఏపీలో 120 కిలోమీటర్ల మేర సాగింది రాహుల్ పాదయాత్ర.. ఏపీ కాంగ్రెస్ నేతలు, ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు.. తుంగభద్ర బ్రిడ్జిపై ఆయనకు స్వాగతం పలికారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు.. రెండు రోజుల పాటు రాయచూర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుండగా.. ఎల్లుండి ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర.. ఇక, ఏపీలో ఇవాళ తన భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ.
Grateful to the people of Andhra Pradesh for their tremendous response to the Yatra. The bond of love I felt with people here is deep & strong.
The Congress shall reciprocate this love with hard work. We will fulfil the commitments made to the people of Andhra Pradesh. pic.twitter.com/85LmwY6FtB
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2022
తాజావార్తలు
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!