Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని మరోసారి హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ..
Read Also: CM YS Jagan: పోలీసులపై పని ఒత్తిడి తగ్గిస్తాం.. వీక్లీ ఆఫ్ ఉండేలా చర్యలు..
Also Read
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
కాగా, ఏపీలో తన పాదయాత్రలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. మూడు రాజధానుల ఆలోచన సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు, అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు రాహుల్.. కాగా, ఏపీలో 120 కిలోమీటర్ల మేర సాగింది రాహుల్ పాదయాత్ర.. ఏపీ కాంగ్రెస్ నేతలు, ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు.. తుంగభద్ర బ్రిడ్జిపై ఆయనకు స్వాగతం పలికారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు.. రెండు రోజుల పాటు రాయచూర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుండగా.. ఎల్లుండి ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర.. ఇక, ఏపీలో ఇవాళ తన భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో.. ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ.
Grateful to the people of Andhra Pradesh for their tremendous response to the Yatra. The bond of love I felt with people here is deep & strong.
The Congress shall reciprocate this love with hard work. We will fulfil the commitments made to the people of Andhra Pradesh. pic.twitter.com/85LmwY6FtB
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2022
తాజావార్తలు
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?