Presidential Naval Fleet Review: యుద్ధనౌకల సమీక్షకు వేదికైన విశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.
మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నంకు గుర్తింపు వుంది.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
కల్వరి సిరీస్ లో నాలుగవ సబ్ మెరైన్ ఐ.ఎన్.ఎస్. వేల. యాంటీషిప్ మిసైళ్లతో విరుచుకుపడే శక్తి సామర్థ్యం వేల జలాంతర్గామి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టానికి వేదికైంది విశాఖ. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్. ఐ.ఎన్. ఎస్.సుమిత్రలో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి. ఆర్కేబీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు కొనసాగనుంది పీఎఫ్ ఆర్. రాష్ట్రపతి 44 యుద్ధ నౌకలను సమీక్ష చేయనున్నారు. పీఎఫ్ఆర్ లో 60 యుద్ధ విమానాలు,హెలీకాప్టర్లు పాల్గొంటున్నాయి. యుద్ధ నౌకలు 55 వున్నాయి. ప్రెసిడెంట్ ప్రయాణించే ఐ.ఎన్. ఎస్. సుమిత్రను అనుసరించనున్నాయి రెండు యుద్ధ నౌకలు. పీ.ఎఫ్.ఆర్.లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ పాల్గొంటాయి.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లఫె్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి డి.జె.చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రిత్వశాఖల కార్యదర్శులు, తదితరులు పి.ఎఫ్.ఆర్. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ సమీక్ష సముద్రంలో జరగనుండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని సీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!