Presidential Naval Fleet Review: యుద్ధనౌకల సమీక్షకు వేదికైన విశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.
మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నంకు గుర్తింపు వుంది.
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
కల్వరి సిరీస్ లో నాలుగవ సబ్ మెరైన్ ఐ.ఎన్.ఎస్. వేల. యాంటీషిప్ మిసైళ్లతో విరుచుకుపడే శక్తి సామర్థ్యం వేల జలాంతర్గామి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టానికి వేదికైంది విశాఖ. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్. ఐ.ఎన్. ఎస్.సుమిత్రలో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి. ఆర్కేబీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు కొనసాగనుంది పీఎఫ్ ఆర్. రాష్ట్రపతి 44 యుద్ధ నౌకలను సమీక్ష చేయనున్నారు. పీఎఫ్ఆర్ లో 60 యుద్ధ విమానాలు,హెలీకాప్టర్లు పాల్గొంటున్నాయి. యుద్ధ నౌకలు 55 వున్నాయి. ప్రెసిడెంట్ ప్రయాణించే ఐ.ఎన్. ఎస్. సుమిత్రను అనుసరించనున్నాయి రెండు యుద్ధ నౌకలు. పీ.ఎఫ్.ఆర్.లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ పాల్గొంటాయి.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లఫె్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి డి.జె.చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రిత్వశాఖల కార్యదర్శులు, తదితరులు పి.ఎఫ్.ఆర్. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ సమీక్ష సముద్రంలో జరగనుండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని సీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!