Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News President Elections In Ap Tomorrow

President Elections: ఏపీలో రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

Published Date :July 17, 2022 , 3:53 pm
By NTV WebDesk
President Elections: ఏపీలో రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల (President elections) పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలో దింపగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించనుంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది పోలింగ్. కేంద్ర బృందం పోలింగ్ కి సంబంధించిన పనులను పర్యవేక్షించింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అబ్జర్వేషన్ టీంలో చంద్రేకర్ భారతి, సంతోష్ అజ్మీరా వున్నారు.

పోలింగ్ ఏర్పాట్లను సెంట్రల్ అబ్జర్వేషన్ టీంకు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. పోలింగ్ ఏర్పాట్లపై సీఈఓ మీనాతో కేంద్రం బృందం భేటీ అయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ లో పాల్గొనాలని అధికారులు సూచించారు. ఇక 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 50 మందికి పైగా అసెంబ్లీ సిబ్బందిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 151 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేనకు చెందిన వారు సభ్యులుగా వున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైసీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

Also Read

  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
  • Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

ఏపీలో మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,488గా వుంది. అలాగే, 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా వుంది. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 53,313 అనీ, ఇందులో వైఎస్సార్‌సీపీ వాటా 45,957గా వుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు విపక్షం టీడీపీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్‌సీపీ 45,957 ఓటు విలువగా వుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న మహిధర్ రెడ్డికి అక్కడే ఓటువేసే అవకాశం కల్పించింది ఈసీ.

Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • Draupadi Murmu
  • EC
  • elections
  • janasena

తాజావార్తలు

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!

  • Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

  • NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions