Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Etela Rajender Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మాక్ పోలింగ్ అనంతరం నిర్వహించిన మీడియా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరదల వెనుకు విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ కు ఈటల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లు ఉందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే ఒక అర్థం ఉండాలని, వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే.. వర్షాలను కురిపించి అక్కడి ప్రజలను చంపుకోదు కదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కరువు ఏర్పడిన సమయంలో మేఘమథనం చేస్తేనే వర్షాలు పడలేదని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే రాజ్యాంగబద్ధంగా వస్తాయనుకున్న రిజర్వేషన్లను కేసీఆర్ ఇవ్వలేదని, గొప్ప దార్శనీకత ప్రదర్శించి మోడీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కానీ ఇక్కడి పాలకులు అలా చేయడంలేదన్నారు. రాజ్యాధికారం వస్తే వారి బతుకులు బాగుపడుతాయని మోడీ ఆలోచన చేస్తుంటే.. ఇక్కడ మాత్ర గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారన్నారు. నిన్నటి టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో తెలంగాణకు కేంద్రం సహాయం చేయాలని కోరతారనుకున్నామని, కానీ గుడ్డి ద్వేషంతో ఆరోపణలు చేశారన్నారు.
Also Read
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ఎఫ్ఆర్ బీఎం చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుందని తెలియకపోవడం ఎలా? అని ఆయన అన్నారు. టాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ను రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులను ఆడిట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఖర్చు చేసే నిధుల వల్ల ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని, ముందు ముందు సోషల్ ఆడిట్ జరుగుతుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోడీ చేసినవేనని, గవర్నర్ వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తే అక్కడ మీ ఎస్పీ, కలెక్టర్ లేడు. ఇది గవర్నర్ ను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ఆమెను అవమానిస్తే.. యావత్ తెలంగాణను అవమానించినట్లేనని ఆయన ధ్వజమెత్తారు. అ
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!