నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిది.. ఉద్యోగుల్లో అసంతృప్తులు సహజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనలకు తల ఊపిరావడంపై కొందరు ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం అయ్యాయి.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.. కలసివచ్చేవారితో ఉద్యమం ఉంటుందంటున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులుమండిపడుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధన సమితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు ఏ రేంజ్లో గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. అయితే.. ఉద్యోగుల నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిదన్నారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ… ఉద్యోగుల ఆందోళన, ఆవేశాలను మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యోగులు ఛలో విజయవాడ ద్వారా తమ అసంతృప్తిని తెలిపినందున ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించిందన్నారు.. అయితే, ఫిట్మెంట్ మినహా మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పునరుద్ధరించారని సంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. ఫిట్మెంట్ విషయంలో ఆశించిన రీతిలో నిర్ణయం రాలేదన్నారు.
Read Also: ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారు-సజ్జల
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
మరో 3 అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు సూర్యనారాయణ.. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ కాకుండా స్టేట్ పీఆర్సీకి రావడం మేజర్ అచీవ్మెంట్ గా తెలిపిన ఆయన.. వచ్చే ఏడాది పీఆర్సీని తీసుకువచ్చేలా పోరాటం చేశామన్నారు.. సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లో తీవ్ర మనోవేదన ఉంది.. మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ రోడ్ మ్యాప్ ను తెలియజేస్తామన్నారని వివరించారు.. సీపీఎస్ రద్దు అంశంపై చాలా తక్కువ సమయంలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్న ఆయన.. ఏళ్ల తరబడి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం తెలిపారని.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.. ఇక, ఫిట్మెంట్ తప్ప సీసీఎ, హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం ఫించన్ పై ఆశాజనకంగా ఉంది.. మంత్రుల కమిటీని రెగ్యులర్ కమిటీగా మార్చాలని సీఎస్ ను సీఎం జగన్ ఆదేశించారు.. ఇకపై మేం కూడా మంత్రుల కమిటీతో సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గడం వల్లే ఆందోళనలు వచ్చాయని సీఎంకు తెలిపామని.. ఉద్యోగుల్లో చిన్న చిన్న అసంతృప్తులు ఉండటం సహజం.. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అన్నారు.. నెలకోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యేందుకు సీఎం అంగీకరించి ఆదేశించారని తెలిపారు.. ఇక, టీచర్ ఎమ్మెల్సీల పదవుల కోసం ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితే మేమేమీ చెప్పలేమన్న ఆయన.. ఉపాద్యాయ సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేందుకు ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో తెలియదన్నారు.. టీచర్ల వల్ల మాత్రమే చలో విజయవాడ విజయవంతం కాలేదు.. అందరు ఉద్యోగుల వల్లే కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు.. హీరోయిజం కోసం ఉపాద్యాయ సంఘాలు ప్రవర్తిస్తే దానికి మేమేమీచేయలేమని.. నిరసన అంతా టీకప్పులో తుఫాన్ లాంటిది.. అంతా సమసి పోతుందని భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!