Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటనలో రాజకీయ కుట్ర కోణం..!
- జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది..
- అనుమానం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు..
- జగన్ తీరు దారుణం.. హింసని ప్రేరేపించే విధంగా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు దారుణంగా ఉంది. హింసని ప్రేరేపించే విధంగా ఉంది జగన్ తీరు ఉంది. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీసేవిధంగా ఉందని విమర్శించారు.. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రెంటపాళ్లలో 100 మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటనకి కావాల్సిన భధ్రత ఇచ్చాం. కానీ, జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉందన్నారు.. బెట్టింగ్ కి పాల్పడే వ్యక్తి కి విగ్రహం కట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం అని ఎద్దేవా చేసిన ఆయన.. జగన్ మాటలు నమ్మే బెట్టింగ్ కాశారు. చనిపోయి సంవత్సరం దాటిన తరువాత పరామర్శకి వెళ్ళారు. రెంటపాళ్ళలో జగన్ పరామర్శకి కాదు… దండ యాత్ర కి వెళ్ళారు. రప్పా.. రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ఇక, జగన్ కారు కింద సింగయ్య పడినా పట్టించుకోలేదు.. ఒక ముఖ్య మంత్రిగా పని చేసిన వ్యక్తి ధోరణి ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు రామానాయుడు.. కొన ఊపిరితో ఉన్న సింగయ్యని హాస్పటల్ కి తీసుకువెళ్ళకుండా జగన్ దారుణం గా వ్యవహరించారు. మానవత్వం లో పించిన వ్యక్తి జగన్. చనిపోయిన సింగయ్య దళిత బిడ్డ.. వైసీపీ ప్రభుత్వంలో దళిత డాక్టర్ సుధాకర్ ని కొట్టి చంపారని ఆరోపించారు.. దళితుడిని కొట్టి చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీతో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అసలు, జగన్ నుండి ప్రజలకే భధ్రత లేదన్నారు.. జగన్ ఎక్కడ పర్యటన చేసినా జనాన్ని పిట్టలుగా చంపుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!