Fake Documents Case: నకిలీ డాక్యుమెంట్స్తో అక్రమాలు.. ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrested 5 People In Fake Documents Case In Vijayawada: నకిలీ డాక్యుమెంట్స్తో అక్రమాలకు పాల్పడిన ఒక ముఠాని విజయవాడలో అరెస్ట్ చేశారు. గాంధీ నగర్ సబ్ రిజిస్టర్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్స్తో ఆ ముఠా రావడాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని గవర్నర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సీఆర్ నం.1/2023 యూ/ఎస్ 419, 420, 465, 467, 468 & 120(బీ) ఐపీసీగా కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ విశాల్ గున్ని మాట్లాడుతూ.. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నారని, విశాఖ నుండి నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా భూములను అమ్మకాలు చేసి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి, లింక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారన్నారు. ఆ తర్వాత ఆస్తిని అమ్మకానికి పెడతారని వివరించారు. విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 19 ప్రాంతాల్లో ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్స్తో భూములను అమ్మి, సొమ్ము చేసుకున్నారని తెలిపారు.
DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు.. ఎందుకంటే?
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
కాగా.. 1980-1988 మధ్య కాలంలో గాంధీనగర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొంతమంది ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చి రిక్రియేషన్ చేయించుకోగా, మరికొంతమంది చేయించుకోలేదు. ఇలాంటి డాక్యుమెంట్ల నంబర్లు తెలుసుకొని, నకిలీ ముఠా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించింది. ఒకవేళ అసలు యజమాని వచ్చి, ఆ స్థలం తనదేనని వారించినా.. తమదే అసలైన రికార్డని కోర్టుకెక్కుతున్నారు. ఇలా వివాదం సృష్టించి, కోట్లు పోగేయడమే ఈ నకిలీ ముఠా ప్రణాళిక. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రర్లో ప్రారంభమైన ఈ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం.. ఆ తర్వాత ఇతర కార్యాలయాల్లోనూ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. శాక పరంగా విచారణ చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక స్థలాన్ని.. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇది విచారణ జరుగుతోంది.
Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్
తాజావార్తలు
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!