Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
- ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం
- కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం బృందం భేటీ
- మీడియా తో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే నెలలో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆయన కార్యాలయం లో కలసి గంటపాటు చర్చలు జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మీడియాకు వివరించారు. పోలవరం సత్వర పూర్తి కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జలశక్తి మంత్రి పాటిల్ సీఎం బృందానికి హామీ ఇచ్చారని రామానాయుడు చెప్పారు. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైపోయిందని అన్నారు. ఎప్పటికి అవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన దుస్థితి నుంచి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి చేస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి జల శక్తి మంత్రికి వివరించి సహకారాన్ని కోరారని మంత్రి నిమ్మల చెప్పారు. మైనర్ ఇరిగేషన్ రంగానికి సంబంధించి ప్రతిపాదనల తాలూకు నిధులు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. కాలువల ద్వారా కాకుండా పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఎంపికైన విజయనగరం జిల్లాలో పనులు ముందుకు తీసుకు వెళుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని నిమ్మల వివరించారు. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలనే నాటి ప్రధాని వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని అవిరళ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే పోలవరం- నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. అలాగే గోదావరి-కావేరి అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నట్లు చెప్పారు.
Also Read
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
- CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
రాష్ట్రంలోని సంప్రదాయ నీటి వనరులైన నదులు, జలాశయాలు, కాలువలు,చెరువులు సద్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ కృషి చేస్తుందని అన్నారు. అలాగే భూగర్భన్ని కూడా జలాశయంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర ప్రతిపాదనకు కేంద్ర మద్దతు ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ దెబ్బతిన్నప్పుడు దాన్ని తక్షణం మార్చి పెను ప్రమాదాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నివారించగలిగిందన్నారు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు 33 కొత్త గేట్లు మారుస్తున్నట్లు చెప్పారాయన.
పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల పునరావాసం, పరిహారాలకు సంబంధించి నిధులను సకాలంలో సమకూరుస్తామని కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన భూసేకరణ, పునరావాసం కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరమన్నారు. ప్రతి ఏడాది గోదావరిలోని 3000 టీఎంసీలు నీరు బంగాళాఖాతంలో కలిసిపోతున్నందున ఈ వృధా జలాలను వినియోగించుకునే విధంగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని, గోదావరి వృధా జలాల వినియోగించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు లబ్ధి పొందాలనేదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అన్నారు. చిన్నపాటి సమస్యలు ఏమైనా తెలంగాణతో ఉంటే సానుకూల వాతావరణంలో చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని కోరామని చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
-
Vaibhav Sooryavanshi Warning: అదే అటాకింగ్ గేమ్ ఆడుతా.. గుజరాత్ టైటాన్స్కు వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
-
AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!