అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జిల్లాలోని ఊరుకొండ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు.. వివాహ వేడుక కోసం బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.. అయితే, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.. కాగా, ఈ ప్రమాదంలో బొమ్మణహల్ కు చెందిన అశోక్, రాధమ్మ, సరస్వతి, శివమ్మ, రాయల దొడ్డికి చెందిన శుభద్రమ్మ, లత్తవరంకు చెందిన స్వాతి, జాహ్నవి, నింబగల్లుకు చెందిన వెంకటప్ప మృతిచెందారు.
Read Also: లతా మంగేష్కర్కు రాజ్యసభ నివాళి