విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ సర్కారే : పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని…ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని… అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని… సీఎం నోటి వెంట అర్ధ సత్యాలు.. అవాస్తవాలు పలికిస్తోంది అధికారులేనని తెలిపారు.
సింగరేణి కి బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసింది వైసీపీ కాదా..? ఆర్టీపీపీ.. వీటీపీఎస్ ప్లాంటును మూత వేయించి.. ప్రైవేట్ వాళ్లకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూజా, కృష్ణపట్నం షట్ డౌన్ అయ్యేలా చేసింది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. అధిక ధరకు పవన విద్యుత్ కొనుగోళ్లు చేయలేని వైసీపీ ప్రభుత్వం.. అదానీ నుంచి అధిక ధరకు సోలార్ విద్యుత్ ఎందుకు కొనుగోళ్లు చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. అదానీ నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా రూ.50 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తారా..? అని నిలదీశారు. ఏపీలోని విద్యుత్ సంస్థలు దివాళా తీయడానికి కారణం వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపే కారణమని నిప్పులు చెరిగారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..