విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగింది : పయ్యావుల కేశవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్ రాష్ట్రం రూ. 1.99కే సౌర విద్యుత్ కొనుగోలు చేసిందని, రూ. 2.49 ఏపీ కొనుగోలు చేయడం ఎంత వరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రూ. 2.49 ఏ విధంగా చౌక అవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
‘గంటల్లోనే ప్రతిపాదనలు.. ఆమోదాలు ఏ విధంగా జరిగాయి. గతంలో గ్రిడ్ సేఫ్టీ లేదన్న ప్రభుత్వం.. ఇప్పుడు గ్రిడ్ ఎలా తట్టుకుంటుందని భావిస్తోంది. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే నాటికి రూ. 2.49 కాదు.. అంతకంటే ఎక్కువే. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే సరికి రూ. 4.50 దాటినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేదలు.. రైతులపై రూ. 1.20 లక్షల కోట్ల భారం పడనుంది. రైతుల పేరుతో జరిగే ఈ విద్యుత్ కోనుగోళ్ల వ్యవహరం స్కీమ్ కాదు.. అదానీ లాభం కోసం చేసే స్కామ్. ప్రభుత్వం పెట్టుకున్న రివర్స్ టెండరింగ్ ఏమైంది..? జూడిషీయరీ ప్రివ్యూ ఏమైంది. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను అదానీలకి నామినేషన్ పద్దతిలో ఇచ్చేశారు. ఏపీఈఆర్సీనే విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించాలి.. కానీ ఆ విధంగా చేయలేదు. సీఎంకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇతర రాష్ట్రాలకు మేలు చేకూరేలా చేయడం ఏంటని, గతంలో ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను అదానీకి కట్టబెట్టినప్పుడు కోర్టు కొట్టేసి కొత్త టెండర్లు పిలమని చెప్పినా ఎందుకు పిలవలేదని, అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను.. సెకీ రూపంలో కట్టబెట్టారన్నారు. ఏపీలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నా.. పక్క రాష్ట్రాల్లో లబ్ది కలిగించడం దేనికని, ఈ స్కీమ్ అమలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్లో కోతలు విధించి రూ. 1.19కే అందిస్తోంది.. ఏపీలో అంతకు మించి అవకాశం ఉన్నా.. ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!