విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగింది : పయ్యావుల కేశవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్ రాష్ట్రం రూ. 1.99కే సౌర విద్యుత్ కొనుగోలు చేసిందని, రూ. 2.49 ఏపీ కొనుగోలు చేయడం ఎంత వరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రూ. 2.49 ఏ విధంగా చౌక అవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
‘గంటల్లోనే ప్రతిపాదనలు.. ఆమోదాలు ఏ విధంగా జరిగాయి. గతంలో గ్రిడ్ సేఫ్టీ లేదన్న ప్రభుత్వం.. ఇప్పుడు గ్రిడ్ ఎలా తట్టుకుంటుందని భావిస్తోంది. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే నాటికి రూ. 2.49 కాదు.. అంతకంటే ఎక్కువే. సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే సరికి రూ. 4.50 దాటినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పేదలు.. రైతులపై రూ. 1.20 లక్షల కోట్ల భారం పడనుంది. రైతుల పేరుతో జరిగే ఈ విద్యుత్ కోనుగోళ్ల వ్యవహరం స్కీమ్ కాదు.. అదానీ లాభం కోసం చేసే స్కామ్. ప్రభుత్వం పెట్టుకున్న రివర్స్ టెండరింగ్ ఏమైంది..? జూడిషీయరీ ప్రివ్యూ ఏమైంది. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను అదానీలకి నామినేషన్ పద్దతిలో ఇచ్చేశారు. ఏపీఈఆర్సీనే విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించాలి.. కానీ ఆ విధంగా చేయలేదు. సీఎంకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read
సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇతర రాష్ట్రాలకు మేలు చేకూరేలా చేయడం ఏంటని, గతంలో ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను అదానీకి కట్టబెట్టినప్పుడు కోర్టు కొట్టేసి కొత్త టెండర్లు పిలమని చెప్పినా ఎందుకు పిలవలేదని, అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను.. సెకీ రూపంలో కట్టబెట్టారన్నారు. ఏపీలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నా.. పక్క రాష్ట్రాల్లో లబ్ది కలిగించడం దేనికని, ఈ స్కీమ్ అమలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్లో కోతలు విధించి రూ. 1.19కే అందిస్తోంది.. ఏపీలో అంతకు మించి అవకాశం ఉన్నా.. ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!