Pawan Kalyan: మా వ్యూహాలు మాకున్నాయి.. వైసీపీ విముక్త ఏపీ టార్గెట్..!
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… జనసేన పీఏసీ ఇవాళ సమావేశమైంది.. సమావేశంలో ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. నాలుగు గంటల పాటు సాగిన పొలిటికల్ ఎఫైర్స్ సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని.. ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హానికరం.. వైసీపీ విముక్త ఏపీ నినాదంతో ఎన్నికలకు వెళ్తామని వెళ్లడించారు.. వైసీపీ సృష్టించే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. కొత్తగా వచ్చే సమస్యలతో పాత సమస్యలను మరిచే స్థాయిలో వైసీపీ సృష్టిస్తోందన్నారు.. ఎన్నో అంశాలకు హామీనిచ్చిన జగన్ మాట తప్పారని ఆరోపించారు పవన్ కల్యాణ్.
Read Also: Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
సగటు కుల నాయకుల్లా నేను మాట్లాడాను.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి, తెలగ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను కలుపుకుని వైసీపీ విముక్త ఏపీ గురించి పోరాడతామని ప్రకటించారు పవన్ కల్యాణ్.. ఇక, మా వ్యూహాలు మాకున్నాయి.. సరైన సమయంలో మా వ్యూహాలు మేం చెబుతామన్న ఆయన.. మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. ఏ వ్యూహమైనా.. వైసీపీ విముక్త ఏపీ కోసమే ఉంటాయని స్పష్టం చేశారు.. అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారాన్ని దక్కేలా చేస్తామన్నారు పవన్.. రాయలసీమలో అధికారం దక్కని కులాలు చాలా ఉన్నాయన్న ఆయన.. తమకు అన్యాయం జరిగితే గొంతెత్తి చెప్పుకునే వెసులుబాటు కూడా రాయలసీమలో లేదన్నారు. రాయలసీమకు కొత్త రక్తం కావాలి.. రావాలి అంటూ పిలుపునిచ్చారు. పరిశ్రమలు రావాలంటే రాయలసీమ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తులకు కప్పం కట్టాల్సిందే.. అందుకే పరిశ్రమలు సీమకు రావడం లేదు.. వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక, మా మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలనే డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!