Pawan Kalyan: బూతులు తిట్టే వైసీపీ నేతలకు వార్నింగ్.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల ఇంకమ్ట్యాక్స్ కట్టానని పవన్ వివరించారు. తన పిల్లల కోసం కట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి మరీ పార్టీకి ఖర్చు చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్ ఫండ్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. జనసేన ఐదు ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందన్నారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయని తెలిపారు. నా సేన-నావంతు విరాళాల రూపంలో రూ. 4 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.
వైసీపీ నేతలకు పాపం బూతులు తిట్టడమే రాదని.. నోట్లో వేలు పెట్టినా వైసీపీ నేతలు కొరకలేరని పవన్ ఎద్దేవా చేశారు. తాను స్కార్పియోలు కొనుకున్నా కొంతమంది సన్నాసులు విమర్శలు చేస్తున్నారని.. ఎవరో తనకు కొనిచ్చారని అంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని అంటున్నారని.. కావాలనుకుంటే వైసీపీ నేతలు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. తాను విడాకులు ఇచ్చి భరణం కూడా ఇచ్చి వేరే పెళ్లిళ్లు చేసుకున్నానని.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే వాళ్లు తనకు చెప్పేందటని ప్రశ్నించారు.
Also Read
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
వైసీపీలో అందరూ నీచులే ఉండరని.. బాలినేని, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారని పవన్ అన్నారు. అయితే వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ అని విమర్శించారు. జనసేన దగ్గర పోరాట పటిమ ఉందని.. కానీ ఎలక్షనీరింగ్ చేయాల్సిన సత్తాను పెంచుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడడం అంటే యుద్దం చేసినట్లేనని అన్నారు. అధికారం కొన్ని కులాలకే పరిమితమైందని.. బడుగులకు అధికారం రావాలని.. దాని కోసమే జనసేన పని చేయాలని పిలుపునిచ్చారు. బడుగులకు అధికారం రావాలంటే రెడ్లను తరిమేద్దాం.. కమ్మలను కొట్టేద్దాం అని కాదన్నారు. వేరే వాళ్లని కొట్టి మనం ఎదగాలన్నారు. బడుగులు ఎదగడానికి తన జీవితాన్ని పణంగా పెడతానని పవన్ స్పష్టం చేశారు. బలిజ-కాపు-ఒంటరి-తెలగ సామాజిక వర్గాలకు బలం ఉంది కానీ అధికారం లేదని బాధ ఉందన్నారు. కానీ అధికారాన్ని దక్కించుకునేందుకు ఏం చేశారని నిలదీశారు. మేమూ మేమూ డ్యాష్ డ్యాష్ అంటూ వైసీపీలోని ఓ నేత ఏదేదో మాట్లాడతున్నారని.. నాలిక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చారు. బంతి.. చామంతి పూబంతి అనే వాడు ఇంకేదో మాట్లాడుతున్నాడని.. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దని హితవు పలికారు. వైసీపీలోని కాపు నేతలు జగన్కు ఊడిగం చేసుకోండని.. కానీ కులాన్ని లోకువ చేయవద్దన్నారు. ఆనాడు కాంగ్రెస్ నేతలను పంచెలుడదీసి కొట్టండి అన్న పదానికి తరువాత బాధపడ్డానని.. కానీ అప్పటి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందని పవన్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!