Pawan Kalyan: బూతులు తిట్టే వైసీపీ నేతలకు వార్నింగ్.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల ఇంకమ్ట్యాక్స్ కట్టానని పవన్ వివరించారు. తన పిల్లల కోసం కట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి మరీ పార్టీకి ఖర్చు చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్ ఫండ్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. జనసేన ఐదు ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందన్నారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయని తెలిపారు. నా సేన-నావంతు విరాళాల రూపంలో రూ. 4 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.
వైసీపీ నేతలకు పాపం బూతులు తిట్టడమే రాదని.. నోట్లో వేలు పెట్టినా వైసీపీ నేతలు కొరకలేరని పవన్ ఎద్దేవా చేశారు. తాను స్కార్పియోలు కొనుకున్నా కొంతమంది సన్నాసులు విమర్శలు చేస్తున్నారని.. ఎవరో తనకు కొనిచ్చారని అంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని అంటున్నారని.. కావాలనుకుంటే వైసీపీ నేతలు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. తాను విడాకులు ఇచ్చి భరణం కూడా ఇచ్చి వేరే పెళ్లిళ్లు చేసుకున్నానని.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే వాళ్లు తనకు చెప్పేందటని ప్రశ్నించారు.
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
వైసీపీలో అందరూ నీచులే ఉండరని.. బాలినేని, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారని పవన్ అన్నారు. అయితే వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ అని విమర్శించారు. జనసేన దగ్గర పోరాట పటిమ ఉందని.. కానీ ఎలక్షనీరింగ్ చేయాల్సిన సత్తాను పెంచుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడడం అంటే యుద్దం చేసినట్లేనని అన్నారు. అధికారం కొన్ని కులాలకే పరిమితమైందని.. బడుగులకు అధికారం రావాలని.. దాని కోసమే జనసేన పని చేయాలని పిలుపునిచ్చారు. బడుగులకు అధికారం రావాలంటే రెడ్లను తరిమేద్దాం.. కమ్మలను కొట్టేద్దాం అని కాదన్నారు. వేరే వాళ్లని కొట్టి మనం ఎదగాలన్నారు. బడుగులు ఎదగడానికి తన జీవితాన్ని పణంగా పెడతానని పవన్ స్పష్టం చేశారు. బలిజ-కాపు-ఒంటరి-తెలగ సామాజిక వర్గాలకు బలం ఉంది కానీ అధికారం లేదని బాధ ఉందన్నారు. కానీ అధికారాన్ని దక్కించుకునేందుకు ఏం చేశారని నిలదీశారు. మేమూ మేమూ డ్యాష్ డ్యాష్ అంటూ వైసీపీలోని ఓ నేత ఏదేదో మాట్లాడతున్నారని.. నాలిక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చారు. బంతి.. చామంతి పూబంతి అనే వాడు ఇంకేదో మాట్లాడుతున్నాడని.. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దని హితవు పలికారు. వైసీపీలోని కాపు నేతలు జగన్కు ఊడిగం చేసుకోండని.. కానీ కులాన్ని లోకువ చేయవద్దన్నారు. ఆనాడు కాంగ్రెస్ నేతలను పంచెలుడదీసి కొట్టండి అన్న పదానికి తరువాత బాధపడ్డానని.. కానీ అప్పటి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందని పవన్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..