Pawan Kalyan: బూతులు తిట్టే వైసీపీ నేతలకు వార్నింగ్.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల ఇంకమ్ట్యాక్స్ కట్టానని పవన్ వివరించారు. తన పిల్లల కోసం కట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి మరీ పార్టీకి ఖర్చు చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్ ఫండ్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. జనసేన ఐదు ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందన్నారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయని తెలిపారు. నా సేన-నావంతు విరాళాల రూపంలో రూ. 4 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.
వైసీపీ నేతలకు పాపం బూతులు తిట్టడమే రాదని.. నోట్లో వేలు పెట్టినా వైసీపీ నేతలు కొరకలేరని పవన్ ఎద్దేవా చేశారు. తాను స్కార్పియోలు కొనుకున్నా కొంతమంది సన్నాసులు విమర్శలు చేస్తున్నారని.. ఎవరో తనకు కొనిచ్చారని అంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని అంటున్నారని.. కావాలనుకుంటే వైసీపీ నేతలు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. తాను విడాకులు ఇచ్చి భరణం కూడా ఇచ్చి వేరే పెళ్లిళ్లు చేసుకున్నానని.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే వాళ్లు తనకు చెప్పేందటని ప్రశ్నించారు.
Also Read
వైసీపీలో అందరూ నీచులే ఉండరని.. బాలినేని, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారని పవన్ అన్నారు. అయితే వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ అని విమర్శించారు. జనసేన దగ్గర పోరాట పటిమ ఉందని.. కానీ ఎలక్షనీరింగ్ చేయాల్సిన సత్తాను పెంచుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడడం అంటే యుద్దం చేసినట్లేనని అన్నారు. అధికారం కొన్ని కులాలకే పరిమితమైందని.. బడుగులకు అధికారం రావాలని.. దాని కోసమే జనసేన పని చేయాలని పిలుపునిచ్చారు. బడుగులకు అధికారం రావాలంటే రెడ్లను తరిమేద్దాం.. కమ్మలను కొట్టేద్దాం అని కాదన్నారు. వేరే వాళ్లని కొట్టి మనం ఎదగాలన్నారు. బడుగులు ఎదగడానికి తన జీవితాన్ని పణంగా పెడతానని పవన్ స్పష్టం చేశారు. బలిజ-కాపు-ఒంటరి-తెలగ సామాజిక వర్గాలకు బలం ఉంది కానీ అధికారం లేదని బాధ ఉందన్నారు. కానీ అధికారాన్ని దక్కించుకునేందుకు ఏం చేశారని నిలదీశారు. మేమూ మేమూ డ్యాష్ డ్యాష్ అంటూ వైసీపీలోని ఓ నేత ఏదేదో మాట్లాడతున్నారని.. నాలిక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చారు. బంతి.. చామంతి పూబంతి అనే వాడు ఇంకేదో మాట్లాడుతున్నాడని.. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దని హితవు పలికారు. వైసీపీలోని కాపు నేతలు జగన్కు ఊడిగం చేసుకోండని.. కానీ కులాన్ని లోకువ చేయవద్దన్నారు. ఆనాడు కాంగ్రెస్ నేతలను పంచెలుడదీసి కొట్టండి అన్న పదానికి తరువాత బాధపడ్డానని.. కానీ అప్పటి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందని పవన్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!