Pawan Kalyan: బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి పవన్ కాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు.
తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తారనేది గాల్లో మాటలు నేను దానికి స్పందించను. నాకు ఢిల్లీ నేతలతోనే సంబంధాలు.. రాష్ట్రంలోని బీజేపీ నేతలతో నాకు అంతగా పరిచయం లేదన్నారు. 2007 నుంచి ఢిల్లీ బీజేపీ నేతలతో పరిచయాలున్నాయి. 2014 తర్వాత సోము వీర్రాజును తొలిసారిగా కలిశాను. ఏపీకి వచ్చే నడ్డాతో భేటీ కావడం లేదు. నా షెడ్యూల్.. ఆయన షెడ్యూల్ వేర్వేరుగా ఉన్నాయన్నారు.
Also Read
గోదావరి గర్జన నిర్వహణ బీజేపీ నిర్ణయం.. ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. మహానాడు సక్సెస్ అయిందంటున్నారా..? మంచిదే అన్నారు పవన్. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుంది..? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ వైసీపీయే…కానీ యువజనులకు ఉపాధి-ఉద్యోగాలు లేవు. శ్రామికులనూ నానా ఇబ్బందులు పెడుతున్నారు.. పనులు దొరకని పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర లేదు. తన పార్టీ పేరులో ఉన్న వాళ్లకే న్యాయం వైఎస్సార్సీపీ న్యాయం చేయలేకపోతోందని విమర్శించారు.
ఉద్రిక్తతలు తగ్గాక.. కోనసీమలో పర్యటిస్తానన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్లు అందర్నీ కొడతారు.. ఓ ఆర్డీవో అనో.. ఏఈ అనో కాదు.. అందర్నీ కొడతారు. కొట్టడం తమ హక్కుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ ఉన్నంత వరకు పోలవరం పూర్తి కాదు. ఎవరి హయాంలో డయాఫ్రం వాల్ దెబ్బతిందనేది ఇరిగేషన్ నిపుణులే చెప్పాలి. కొన్ని కులాలను వైసీపీ తమ వర్గ శత్రువులుగా భావిస్తోంది. కమ్మ, కాపు, మత్స్యకార, బీసీ కులాలను వైసీపీ వర్గ శత్రువుగా భావిస్తోంది. ఇది సమాజానికి మంచిది కాదని కామెంట్లు చేశారు పవన్.
మరి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాకుంటే ఇంకెవ్వరు అనేది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక అవుతోంది. రెండు పార్టీలు అంగీకరించే అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.ఎన్నికలకు వెళ్ళడానికి ఇంకా సమయం వుండడంతో రెండు పార్టీలు ఎలా ముందుకెళతాయో చూడాలి.
Raghunandan Rao: ఆమ్నేషియా పబ్ కేసులో హోంమంత్రి మనవడే ప్రధాన సూత్రధారి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!