Raghunandan Rao: ఆమ్నేషియా పబ్ కేసులో హోంమంత్రి మనవడే ప్రధాన సూత్రధారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది, ఇన్నోవా ఎవరిదని ప్రశ్నించారు. ఈ కార్లను ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. సీసీ కెమెరా పుటేజీ మీ దగ్గర ఉందా.. డీజీపీ మహేందర్ రెడ్డి చెబితే బాగుంటుందని అన్నారు.
పథకం ప్రకారం హిందు అమ్మాయిలపై రజాకార్ల మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హోంమంత్రిని తొలగించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికైతే ఈ కేసుతో సంబంధం ఉందో వారందరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. హోమంత్రిని ఉంటే పారదర్శకతంగా విచారణ జరగదని బీజేపీ తరుపున మేం భావిస్తున్నాం అని అన్నారు. మైనర్ అమ్మాయిలకు సంబంధించిన కేసులో విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా విచారణ జరగాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అయితే ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అత్యాచార వ్యవహారంలో నలుగురు నిందితులపై పోక్సో కేసును పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని వైద్య పరీక్షలు పంపించారు. ఈ ఘటనలో బాలికను పబ్ కు తీసుకెళ్లిన హాడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హాడీని బురిడి కొట్టించి అమ్మాయిని కార్లో తీసుకెళ్లారని.. రెండు గంటల పాటు నలుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బాలికను పబ్ దగ్గర కార్లో దించారు. ఈ ఘటనకు సంబంధించి పబ్, బేకరీ సీసీ కెమెరా ఫులేజ్ ను పోలీసులు కలెక్ట్ చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!