Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
Pawan Kalyan Comments In Janasena Leaders Interaction: కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే, వ్యవస్థ నాశనం అవుతుందని.. వైసీపీ ఇదే చేస్తోందని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్లో రాజోలు నియోజకవర్గ జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత చెందాలంటే భావజాలం అవసరమని, ఇదే జనసేన పార్టీ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు ద్వీపం.. ఈరోజు కడప రాజంపేట దాకా వెలుగుతోందని అన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి మన దేశంలో శిక్ష పడుతోందని, కానీ రూ.5 వేల కోట్లు తినేసిన వాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అది మన దౌర్భాగ్యమని అన్నారు.
Online Order: నాలుగేళ్ల కిందట ఆర్డర్ చేస్తే.. ఇప్పుడు డెలివరీ చేసిన ఈ కామర్స్ సంస్థ..
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
అర్థనారీశ్వరి తత్వం అంటూ మనం మహిళల్ని గౌరవిస్తాం కానీ.. రాజకీయాల్లో వాళ్లకు మూడోవంతు కూడా ఇవ్వలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆడపడుచులు మూడోవంతు ఉండాలని ఆకాంక్షించిన ఆయన.. మహిళల రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని హామీ ఇచ్చారు. వర్గాలు ఉండటంలో తప్పు లేదు కానీ.. ఆ వర్గాలు పార్టీ జయించేలా ఉండాలే తప్ప, పార్టీని దిగజార్చే విధంగా ఉండకూడదని సూచించారు. రాజోలు విజయం తనకు ప్రేరణ ఇవ్వడం వల్లే.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కేంద్రీకృతం చేస్తున్నామన్నారు. మాటల్ని ఆయుధంగా మార్చుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. తాను గొడవలు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనన్న ఆయన.. తన జనసేన కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాల్ని అడ్డుపెడతానని చెప్పుకొచ్చారు.
Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
ఆంధ్రప్రదేశ్ను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని.. అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదన్నారు. తమ ఓట్లతో రాపాక అసెంబ్లీకి వెళ్లారని.. రాపాక లాంటి వారిని రీకాల్ చేయాలని చెప్పారు. వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనన్న పవన్.. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యుల్ని తీసుకున్నట్లు వివరించారు.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!