Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Comments In Janasena Leaders Interaction: కుల ప్రాతిపదికన రాజకీయం చేస్తే, వ్యవస్థ నాశనం అవుతుందని.. వైసీపీ ఇదే చేస్తోందని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్లో రాజోలు నియోజకవర్గ జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత చెందాలంటే భావజాలం అవసరమని, ఇదే జనసేన పార్టీ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో వెలిగిన చిరు ద్వీపం.. ఈరోజు కడప రాజంపేట దాకా వెలుగుతోందని అన్నారు. రూ.200 లంచం తీసుకున్న ఉద్యోగికి మన దేశంలో శిక్ష పడుతోందని, కానీ రూ.5 వేల కోట్లు తినేసిన వాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అది మన దౌర్భాగ్యమని అన్నారు.
Online Order: నాలుగేళ్ల కిందట ఆర్డర్ చేస్తే.. ఇప్పుడు డెలివరీ చేసిన ఈ కామర్స్ సంస్థ..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
అర్థనారీశ్వరి తత్వం అంటూ మనం మహిళల్ని గౌరవిస్తాం కానీ.. రాజకీయాల్లో వాళ్లకు మూడోవంతు కూడా ఇవ్వలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆడపడుచులు మూడోవంతు ఉండాలని ఆకాంక్షించిన ఆయన.. మహిళల రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని హామీ ఇచ్చారు. వర్గాలు ఉండటంలో తప్పు లేదు కానీ.. ఆ వర్గాలు పార్టీ జయించేలా ఉండాలే తప్ప, పార్టీని దిగజార్చే విధంగా ఉండకూడదని సూచించారు. రాజోలు విజయం తనకు ప్రేరణ ఇవ్వడం వల్లే.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కేంద్రీకృతం చేస్తున్నామన్నారు. మాటల్ని ఆయుధంగా మార్చుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. తాను గొడవలు పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనన్న ఆయన.. తన జనసేన కార్యకర్తల్ని కాపాడుకోవడానికి తన ప్రాణాల్ని అడ్డుపెడతానని చెప్పుకొచ్చారు.
Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
ఆంధ్రప్రదేశ్ను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని.. అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని జీరో చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లులో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదన్నారు. తమ ఓట్లతో రాపాక అసెంబ్లీకి వెళ్లారని.. రాపాక లాంటి వారిని రీకాల్ చేయాలని చెప్పారు. వైసీపీ చేసినట్లు తాను కుల రాజకీయాలు చేయలేనన్న పవన్.. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యుల్ని తీసుకున్నట్లు వివరించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!