Online Order: నాలుగేళ్ల కిందట ఆర్డర్ చేస్తే.. ఇప్పుడు డెలివరీ చేసిన ఈ కామర్స్ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఆన్ లైన్ హవా కొనసాగుతుంది. ప్రతీ వస్తువు ఆన్ లైన్ లోనే దొరుకుతోంది. అనేక వస్తువులను మనం ఇలా ఆర్డర్ చేస్తే.. ఈ కామర్స్ సంస్థలు అలా డెలివరీ చేస్తున్నాయి. ఆన్ లైన్ లో చివరికి మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం ఆన్ లైన్ లోనే వినియోగదారులు ఆర్డర్ చేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలపై పెరిగిన నమ్మకం.. వారి అందిస్తున్న సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
Read Also : Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
Also Read
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
అయితే, ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఎప్పుడో చేస్తారో కూడా ఈ ఆన్ లైన్ సంస్థలు చెబుతాయి. ఇంకా.. ఆన్ లైన్ ట్రాకింగ్ లాంటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతమైతే ఈ-కామర్స్ సంస్థలు దాదాపు వారం, పది రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే.. విచిత్రంగా ఓ వ్యక్తి ఓ వస్తువును ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు ఓ ఈ కామర్స్ సంస్థ డెలివరీ చేసింది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ చైనాకు చెందిన ఈ-కామర్స్ వేదిక ఆలీ ఎక్స్ ప్రెస్ నుంచి కరోనా ప్రారంభానికి ముందే ఓ వస్తువును ఆర్డర్ చేశాడు.
Read Also : KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్
అయితే ఆ వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెల్లడించడంతో.. అది కాస్తా.. వైరల్ అవుతుంది. దీంతో నితీన్ అగర్వాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకసారి మీ వస్తువులూ డెలివరీ అవుతాయి అంటూ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నాడు. ఈ విషయం వైరల్ గా మారడంతో నెటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Read Also : Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
2017-19 మధ్యకాలంలో నేను చాలా ఆర్డర్లు చేశాను.. బిల్లులన్నీ ఉన్నాయి.. వాటి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులన్నీ ఏదో ఓ సమయానికి డెలివరీ అవుతాయన్న నమ్మకం వచ్చిందని ఓ యూజర్ అన్నాడు. ఇదిలా ఉంటే.. జాతీయ భద్రతను కారణంతో.. 2020లో భారత ప్రభుత్వం ఆలీ ఎక్స్ ప్రెస్ ను బ్యాన్ చేసింది. అయితే.. ఈ సంస్థను నిషేధించక ముందే నితిన్ అగర్వాల్ ఈ వస్తువును కొనుగోలు చేశారు. అయితే.. తాను ఏ వస్తువును కొన్నది మాత్రం అతను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!