Bv Raghavulu: అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక..
- ఖర్చులు తగ్గించేందుకే జమిలి ఎన్నికలు..
- ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ లా మోడీ వాదన..
- ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుంది..
- అధ్యక్ష తరహా పాలన కోసమే వన్ నేషన్- వన్ ఎలక్షన్- బీవీ రాఘవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bv Raghavulu: విజయవాడలో నిర్వహిస్తున్న కామ్రేడ్ ఏచూరి సీతారం సంతాప సభలో ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, రామకృష్ణ, మాజీమంత్రి అంబటి రాంబాబు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గడం కోసమట.. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాదన ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Chelluboina Venugopal: వంద రోజుల కూటమి పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టింది..
Also Read
- CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్లకు ప్రశంసలు..
- AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
- CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
ఇక, అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు.. ప్రదీప్ పురకాయస్తా అనే ఇంజనీర్ ను మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం సీతారాం ఏచూరి పోరాడారు.. ప్రజాస్వామ్య రక్షణ అత్యవసరమైన సమయంలో సీతారాం ఏచూరి మరణం బాధాకరం అని ఆయన అన్నారు. ఇక, గత నాలుగు రోజులుగా తిరుమల లడ్డూ గొడవ జరుగుతోంది.. లడ్డు అంశంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. లడ్డులో వాడే ఉప్పు, శనగపిండి, పంచదార కూడా కల్తీ కావొచ్చు అన్నారు. ధనవంతుడైన ఆ దేవుడి దగ్గర పందికొక్కులన్నీ చేరాయి.. పవిత్రత అంటూ మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగాలి అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి కమ్యూనల్ సివిల్ కోడ్ అనే విధానాన్ని మారుస్తారంటా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే విధానమట.. జైల్లో నంబర్ల లాగా ఆధార్ నంబర్ మనందరి నంబర్ అవుతుందట.. అందరి మీద ఒక ఏకత్వాన్ని రుద్దడం.. విభజనకు దారి తీస్తుంది.. విశ్వగురువు కావాలంటే.. ప్రతీ దేశ పౌరుడు దేశంలో భాగంగా భావించాలి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్లకు ప్రశంసలు..
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?