YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్ ప్లగ్స్ అంటుకుని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. బీసీ నాయకుడి వాయిస్ అణగదొక్కాలని ఇలా చేయటం న్యాయమా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. రమేష్ ఇంటిపై 5 గంటలకు దాడి జరిగితే పోలీసులు, టీడీపీ నేతలు పథక రచన చేశారు.. పోలీసులు, టీడీపీ నేతలతో కలసి ప్లాన్ చేసి దాడి చేశారని విమర్శించారు.. టీడీపీ నేతలు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దాడి చేసిన వీడియో ఫుటేజ్ లు కూడా ఉన్నాయన్న ఆయన.. పోలీసుల సమక్షంలోనే నిప్పు పెట్టారు.. దాడి చేసిన టీడీపీ నేతలు మొత్తం చంద్రబాబు, లోకేష్ కి అత్యంత సన్నిహితులే అని తెలిపారు..
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా..? జంగిల్ రాజ్ లో ఉన్నామా..? అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు వైఎస్ జగన్.. జోగి రమేష్ ఆయన మీద పెట్టిన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో దాడి చేశారు.. లోకల్ పోలీసులతో పాటు సీపీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అంబటి రాంబాబు ఇంటి దగ్గర దహనకాండ సమయంలో కూడా పోలీసులు ఇలాగే చేశారు.. పోలీసుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరిగిందన్నారు.. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు.. గుంటూరులో అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!