YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్ ప్లగ్స్ అంటుకుని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. బీసీ నాయకుడి వాయిస్ అణగదొక్కాలని ఇలా చేయటం న్యాయమా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. రమేష్ ఇంటిపై 5 గంటలకు దాడి జరిగితే పోలీసులు, టీడీపీ నేతలు పథక రచన చేశారు.. పోలీసులు, టీడీపీ నేతలతో కలసి ప్లాన్ చేసి దాడి చేశారని విమర్శించారు.. టీడీపీ నేతలు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దాడి చేసిన వీడియో ఫుటేజ్ లు కూడా ఉన్నాయన్న ఆయన.. పోలీసుల సమక్షంలోనే నిప్పు పెట్టారు.. దాడి చేసిన టీడీపీ నేతలు మొత్తం చంద్రబాబు, లోకేష్ కి అత్యంత సన్నిహితులే అని తెలిపారు..
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా..? జంగిల్ రాజ్ లో ఉన్నామా..? అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు వైఎస్ జగన్.. జోగి రమేష్ ఆయన మీద పెట్టిన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో దాడి చేశారు.. లోకల్ పోలీసులతో పాటు సీపీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అంబటి రాంబాబు ఇంటి దగ్గర దహనకాండ సమయంలో కూడా పోలీసులు ఇలాగే చేశారు.. పోలీసుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరిగిందన్నారు.. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు.. గుంటూరులో అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!