MLA Vasantha Krishna Prasad: జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
- జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్ధన్రావు నకిలీ మద్యం వ్యాపారం..
- సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
- జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు బయటకు..
MLA Vasantha Krishna Prasad: వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్ధన్రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు.. నకిలీ మద్యంపై జోగి రమేష్ అనుచరుడే సమాచారం ఇచ్చారు.. జోగి రమేష్ అనుచరుడు సురేష్ ఎక్సైజ్శాఖకు తెలిపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. జోగి రమేష్పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. కుట్రలు చేసి టీడీపీ నాయకులపై నెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..
Read Also: Ananthapur : అనంతపురం జిల్లాలో సీఐ రాజు వివాదం.. పోలీస్ వ్యవహారంపై వేడెక్కుతున్న చర్చలు !
Also Read
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
- 10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
ఇక, వైఎస్ జగన్ పాలనలో జరిగిన మద్యం స్కామ్ నుంచి దృష్టి మళ్లించడానికి నకిలీ మద్యం కేసు తెరపైకి తెచ్చారని ఆరోపించారు వసంత కృష్ణప్రసాద్.. నాడు మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ వెళ్లారు.. నేడు జోగి రమేష్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి నకిలీ మద్యం స్కామ్లో భాగస్వామిని చేశారని దుయ్యబట్టారు.. నకిలీ మద్యం కుంభకోణంలో వైఎస్ జగన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. కాగా, నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్ధన్రావు.. తాను జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని ఓ వీడయోలో పేర్కొన్న విషయం విదితమే.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నకిలీ మద్యం తయారీ ఆపేశామని.. కానీ, మళ్లీ జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేయడం మొదలు పెట్టానంటూ జనార్ధన్రావు వీడియో పేర్కొనడం కలకలం సృష్టించింది.. అయితే, ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. మరోవైపు, జనార్ధన్రావు వీడియోపై స్పందించిన జోగి రమేష్.. ఇదంతా చంద్రబాబు కుట్రగా అభివర్ణించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!