Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!
- అమరావతిని మరలా పునఃప్రారంభించటం శుభదాయకం
- అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం
- రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి నగరాన్ని నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిని మరలా పునఃప్రారంభించటం మంచి శుభదాయకం అని, ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిదని, దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూసుకుంటాం అని కేంద్ర మంత్రి నిర్మలమ్మ హామీ ఇచ్చారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు.
Also Read: CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
‘నూతన రాజధాని అమరావతిని మళ్లీ పునఃప్రారంభించటం మంచి శుభదాయకం. ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇలా ఒకే స్ట్రీట్లో 15 బ్యాంకులు ఏర్పాటు చేయటం అనేది మాములు విషయం కాదు. హైదరాబాద్లో ఫైనాన్స్ జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు పాత్ర ఏవిధంగా ఉందో.. అలాగే ఇప్పుడు అమరావతిని బ్యాంకుల స్ట్రీట్గా మార్చటం మరొకసారి ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం. రైతులకి ఎలాంటి సమస్య లేకుండా బ్యాంకింగ్ సెక్టార్ని అందించటం మీ బాధ్యత. మధ్యతరగతి కుటుంబాలకి మంచి పోషకమైన పదార్దాలు అందించాలని ఉంటుంది. కాయగూరలు, పండ్లు ఒక చోటుకి తీసుకొచ్చే విధంగా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయటంతో ఆంధ్రప్రదేశ్లోని రైతులు నష్టపోకుండా చూసుకోగలుగుతాము. వాటి మార్కెట్ కోసం ఢిల్లీ లాంటి రాష్ట్రాలకి తరలించటంలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుంది’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తాజావార్తలు
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..