Nimmala Ramanaidu : కృష్ణా జలాల్లో 512 TMC సాధించిన ఘనత చంద్రబాబుది
- అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సాగునీటి ఎన్నికలు నిర్వహించాం
- జగన్ హయాంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి
- మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకున్నారు
- శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టు రూ.150 కోట్లు : మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధాన కాలువలు, డ్రైన్ల మరమ్మతులకు మొట్టమొదటి ఏడాదిలోనే రూ.344 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు గత ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ, తాము ఏడాదిలోనే రూ.1,900 కోట్ల పరిహారం అందజేశామని నిమ్మల తెలిపారు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
హంద్రీ-నీవా పనులను కూడా వేగవంతం చేసి ఇప్పటివరకు రూ.3,870 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేశామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.2,352 కోట్లు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో వంశధార, తోటపల్లి, హిరమండలం వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధికి రాబోయే రెండేళ్లలో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా జలాల్లో 512 TMC నీటిని సాధించడం పూర్తిగా చంద్రబాబు నాయకత్వపు ఘనతేనని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కృష్ణా జలాల అంశంలో గత ప్రభుత్వం ఎప్పుడూ మౌనం వహించినట్టు ఆయన విమర్శించారు. 2020లో డయాఫ్రం వాల్ కూలినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!