Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
- ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- 7 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..
- 16,666 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ కి నోటిఫికేషన్ చేస్తూ ఉత్తర్వులు ..
- అమరావతి మండలం లోని గ్రామాలు-7465 ఎకరాలు..
- గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో 9097 ఎకరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి..
Read Also: Metro Struked in Subway: సబ్వే కింద సడెన్గా ఆగిపోయిన మెట్రో.. భయపడిపోయన ప్రయణికులు
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఇక, అదనంగా, ఈ భూ సమీకరణ తర్వాత 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులోకి రానుంది. మొత్తంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ తర్వాత 20,494 ఎకరాలు రాజధాని అభివృద్ధికి సిద్ధం కానున్నాయి.
అమరావతి మండలం భూముల వివరాలు (7,465 ఎకరాలు)
వైకుంఠపురం – 1,965 ఎకరాలు
పెద్దమద్దూరు- 1,018 ఎకరాలు
ఏంద్రాయి- 1,879 ఎకరాలు, 46 ఎకరాలు అసైన్డ్ భూమి
కర్లపూడి లేమల్లే- 2,603 ఎకరాలు, 51 ఎకరాల ఎసైన్డ్ భూమి
తుళ్లూరు మండలం భూముల వివరాలు (9,097 ఎకరాలు)
వడ్లమాను – 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72 ఎకరాలు..
హరిశ్చంద్రాపురం – 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు
పెద్దపరిమి – 5,886.18 ఎకరాలు.. సీఆర్డీఏ బాధ్యతల్లోకి ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు..
భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తదుపరి దశలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండో విడత భూ సమీకరణతో అమరావతి అభివృద్ధి కార్యక్రమానికి కొత్త ఊపిరి చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భూములను సమీకరించిన నేపథ్యంలో, రెండో విడత పూర్తి అయితే అమరావతి మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..