Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
- ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- 7 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..
- 16,666 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ కి నోటిఫికేషన్ చేస్తూ ఉత్తర్వులు ..
- అమరావతి మండలం లోని గ్రామాలు-7465 ఎకరాలు..
- గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో 9097 ఎకరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి..
Read Also: Metro Struked in Subway: సబ్వే కింద సడెన్గా ఆగిపోయిన మెట్రో.. భయపడిపోయన ప్రయణికులు
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
ఇక, అదనంగా, ఈ భూ సమీకరణ తర్వాత 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులోకి రానుంది. మొత్తంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ తర్వాత 20,494 ఎకరాలు రాజధాని అభివృద్ధికి సిద్ధం కానున్నాయి.
అమరావతి మండలం భూముల వివరాలు (7,465 ఎకరాలు)
వైకుంఠపురం – 1,965 ఎకరాలు
పెద్దమద్దూరు- 1,018 ఎకరాలు
ఏంద్రాయి- 1,879 ఎకరాలు, 46 ఎకరాలు అసైన్డ్ భూమి
కర్లపూడి లేమల్లే- 2,603 ఎకరాలు, 51 ఎకరాల ఎసైన్డ్ భూమి
తుళ్లూరు మండలం భూముల వివరాలు (9,097 ఎకరాలు)
వడ్లమాను – 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72 ఎకరాలు..
హరిశ్చంద్రాపురం – 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు
పెద్దపరిమి – 5,886.18 ఎకరాలు.. సీఆర్డీఏ బాధ్యతల్లోకి ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు..
భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తదుపరి దశలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండో విడత భూ సమీకరణతో అమరావతి అభివృద్ధి కార్యక్రమానికి కొత్త ఊపిరి చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భూములను సమీకరించిన నేపథ్యంలో, రెండో విడత పూర్తి అయితే అమరావతి మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!