Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
- ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- 7 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..
- 16,666 ఎకరాలకి ల్యాండ్ పూలింగ్ కి నోటిఫికేషన్ చేస్తూ ఉత్తర్వులు ..
- అమరావతి మండలం లోని గ్రామాలు-7465 ఎకరాలు..
- గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో 9097 ఎకరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి..
Read Also: Metro Struked in Subway: సబ్వే కింద సడెన్గా ఆగిపోయిన మెట్రో.. భయపడిపోయన ప్రయణికులు
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
ఇక, అదనంగా, ఈ భూ సమీకరణ తర్వాత 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులోకి రానుంది. మొత్తంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ తర్వాత 20,494 ఎకరాలు రాజధాని అభివృద్ధికి సిద్ధం కానున్నాయి.
అమరావతి మండలం భూముల వివరాలు (7,465 ఎకరాలు)
వైకుంఠపురం – 1,965 ఎకరాలు
పెద్దమద్దూరు- 1,018 ఎకరాలు
ఏంద్రాయి- 1,879 ఎకరాలు, 46 ఎకరాలు అసైన్డ్ భూమి
కర్లపూడి లేమల్లే- 2,603 ఎకరాలు, 51 ఎకరాల ఎసైన్డ్ భూమి
తుళ్లూరు మండలం భూముల వివరాలు (9,097 ఎకరాలు)
వడ్లమాను – 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72 ఎకరాలు..
హరిశ్చంద్రాపురం – 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు
పెద్దపరిమి – 5,886.18 ఎకరాలు.. సీఆర్డీఏ బాధ్యతల్లోకి ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు..
భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తదుపరి దశలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండో విడత భూ సమీకరణతో అమరావతి అభివృద్ధి కార్యక్రమానికి కొత్త ఊపిరి చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో భూములను సమీకరించిన నేపథ్యంలో, రెండో విడత పూర్తి అయితే అమరావతి మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!