Land Rates: ఏపీలో భూముల ధరలకు రెక్కలు..! రేపటి నుంచే అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Rates: ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ భారీగా పెరగబోతోంది.. రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు అమల్లోకి రాబోతున్నాయి.. భూముల మార్కెట్ ధరలను సవరించే దిశగా ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం చేరవేసింది ప్రభుత్వం.. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు ఉన్నాయి.. అంటే.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైతే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.. ఈ సారి 10-15 శాతం మేర భూముల విలువను పెంచే అవశాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురు చూస్తోంది.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉత్తర్వులు విడుదల చేయనున్నారు అధికారులు.
Read Also: Elon Musk: పెళ్లి కుమారుడి గెటప్లో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న ఫొటోలు
Also Read
అయితే, గత ఏడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ ప్రభుత్వం మార్కెట్ ధరలను పెంచేసింది.. కానీ, జిల్లా కేంద్రాలతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. అయితే గతంలో ఏ ఏ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచలేదో వాటి ధరలను మాత్రమే ఇప్పుడు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో భూముల ధరలు పెంపు వేర్వేరుగా ఉండబోతోంది.. మరోవైపు.. 2020 తర్వాత ఏపీలో మార్కెట్ విలువను పెంచలేదు. స్పెషల్ రివిజన్ పేరిట ఇప్పుడు మార్కెట్ వేల్యూని పెంచుతుంది. గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు కాకముందు ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువను పెంచింది ఏపీ ప్రభుత్వం. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచింది. ఇక, మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామంటున్న వైసీపీ సర్కార్.. త్వరలోనే విశాఖ కేంద్రం పాలన ప్రారంభిస్తాం అంటోంది.. దీంతో, విశాఖ లాంటి నగరాల్లో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.. విశాఖ నగరంలో ప్రాంతాన్ని బట్టి మార్కెట్ విలువ పెంచబోతున్నారట.. విశాఖ, గాజువాక, గోపాలపట్నం, ద్వారకానగర్, పెందుర్తి, భీమిలి, మధురవాడ, ఆనందపురం ఏరియాల్లో డిమాండ్ను బట్టి ధరలు పెంచనున్నట్టు తెలుస్తోంది.. దీనిపై ఉత్తర్వులు విడుదలైతే క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!