AP Deputy CM: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..
- జల్ జీవన్ మిషన్ పనులు పరుగులు తీయించాలి..
- ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఎస్ఈ.. ఈఈలతో నవంబర్ 8న వర్క్షాప్..
- జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు. ఈ రోజు (బుధవారం) మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ.. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జేజేఎంలో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపించిన నిధులను గత ప్రభుత్వం ఏ దశలోనూ సక్రమంగా వినియోగించలేదని చెప్పుకొచ్చారు.
Read Also: Suspended : ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్
Also Read
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
ఇక, ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన పనుల్లో పైప్ లైన్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేయలేదని సమీక్షల ద్వారా తేలిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పలు చోట్ల అసలు పనులే మొదలు కాలేదు.. వీటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంది.. జల్ జీవన్ మిషన్ పనులు సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని ఇవ్వగలం.. ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టబోతుందో.. ఇందుకు అనుసరించే ప్రణాళికలను తెలియజేసేందుకు ఆర్.డబ్ల్యూఎస్ విభాగానికి చెందిన ఎస్ఈలు, ఈఈలతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. అదే విధంగా క్షేత్ర స్థాయి ఇంజినీరింగ్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్ఈలు, ఈఈలతో వర్క్ షాప్ ను వచ్చే నెల 8వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!