Kurnool: హంద్రీనీవా ప్రధాన కాలువను పూడ్చేసిన నేషనల్ హైవే కాంట్రాక్టర్..
- బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను పూడ్చేసిన నేషనల్ హైవే కాంట్రాక్టర్..
- శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు. జూన్ ఆఖరు నాటికి కాలువలో మట్టి తొలగిస్తామనే కండిషన్ తో ఇరిగేషన్ అధికారులు అనుమతించారు. జూలై ముగిసినా కాలువలో మట్టి తొలగించకపోవడంతో శ్రీశైలం జలాలను అధికారులు విడుదల చేయలేదు.
Read Also: Kejriwal: ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్ పరిశీలించనున్న ఢిల్లీ కోర్టు
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
కాగా, ఇరిగేషన్ అధికారులు నోటీస్ ఇచ్చినా నేషనల్ హైవే కాంట్రాక్టర్ స్పందించలేదు.. హైవే కాంట్రాక్టర్ తీరుతో హంద్రీనీవా కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పాడింది. హంద్రీనీవా కాలువలో కాంట్రాక్టర్ మట్టి తొలగించి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ దుస్థితిని సీపీఎం నేతల బృందం పరిశీలించారు.
Read Also: Minister Ramprasad Reddy: ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?
ఇక, తక్షణమే ఎన్ హెచ్ ఏఐ డైవర్షన్ రోడ్డును తొలగించి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరందించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కర్నూలు- ఆత్మకూరు హైవేలో బ్రిడ్జి కోసం హంద్రీనీవా కాలువ పూడ్చి వేశారు అంటూ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నీటితో నిండినప్పటికీ రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడం విచారకరం అని మండిపడ్డారు. ఆగస్టు 1వ తేదీన మడకశిరకు వస్తున్న సీఎం రాయలసీమ కరువు ప్రాంతాల్లో పర్యటించాలి అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..