Nara Lokesh: ‘మీ విధానాలతో 42 వేల పాఠశాలలు 11 వేలకు తగ్గిపోతాయి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ విద్యాలయాలు కునరిల్లుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీన నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందన్నారు.
జాతీయ విద్యా విధానం అమలును ఇంకా ఏ రాష్ట్రం మొదలు పెట్టకుండానే ఏపీలో ప్రారంభించేశారని.. సమస్యలపై ఎటువంటి అధ్యయనం లేకుండా మన రాష్ట్రంలో ఆరంభించడం వల్ల బడికి దూరమైన విద్యార్థులు రోడ్డున పడటం చూశామని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్ఈపీ సూచనల మేరకు కరిక్యులమ్, బోధనా విధానాలు అమలు కోసమే పాఠశాల విద్యను నాలుగు స్థాయిలుగా విభజించారన్నారు. అయితే పాఠశాలలను విభజించాల్సిన అవసరంలేదని కేంద్రం స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శలు చేశారు. పాఠశాలలను విభజించడంతో సమస్య తీవ్రమైందని.. జాతీయ విద్యావిధానం అమలు చేసే తొందర కంటే పాఠశాలలు, ఉపాధ్యాయులను తగ్గించే ఆతృత ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు.
Sajjala: రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్ ఎవరికి? వెంకయ్య ఉంటేనే మద్దతిస్తారా?
Read Also:
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో అమలు వల్ల పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్దీకరణతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ బడులు ఇంకా దూరం అవుతున్నాయన్నారు. దివేందుకు ఇంటికి దగ్గరలో ఉన్న బడినే తీసేయడం పేదవారిని చదువుకు దూరం చేయడమే అవుతుందన్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూళ్లలోనూ కలపటంవల్ల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందన్నారు. హెడ్మాస్టర్, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించకపోవడం విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.
పిల్లలకి పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలోపే ఉండాలని విద్యావిధానాలు చెబుతుంటే ప్రభుత్వం ఏకంగా 3 కిలోమీటర్ల దూరానికి పాఠశాలలు తరలించడం ప్రభుత్వ విద్యను పేదలకి దూరం చేయడమేనని లోకేష్ ఆరోపించారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేషనలైజేషన్ పేరుతో నియంతృత్వ పోకడలతో అమలు చేస్తోన్న ఈ విద్యావిధానం వల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠశాలలు భవిష్యత్తులో 11 వేలకు తగ్గిపోతాయన్నారు. రేషనలైజేషన్ విధానంవల్ల మొత్తం 55 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడం విద్యా వ్యవస్థకే మరణ శాసనం లాంటిదన్నారు. మరో పదేళ్లపాటు డీఎస్సీ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో టీచర్ కావాలని కలలు కంటున్న లక్షలాది మంది ఆశలు ఆవిరి చేయడం దారుణమని లోకేష్ విమర్శలు చేశారు. తల్లిదండ్రులు కూలీ, నాలికి వెళ్తే.. ప్రభుత్వం దూరం చేసిన పాఠశాలలకు వాగులు, వంకలు దాటి పిల్లలు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. పాఠశాలలు తెరిచిన రోజునే రాష్ట్రవ్యాప్తంగా తమ బడులు తరలించొద్దంటూ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్లు ఎక్కారన్నారు. జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్యయనం లేకుండానే అమలు చేయడంతో 10 వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్కు రాసిన లేఖలో లోకేష్ కోరారు. పేదపిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!