Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Nara Lokesh Wrotes Letter To Cm Jagan About Government Schools

Nara Lokesh: ‘మీ విధానాలతో 42 వేల పాఠ‌శాల‌లు 11 వేల‌కు త‌గ్గిపోతాయి’

Published Date :July 6, 2022 , 6:03 pm
By Ramesh Nalam
Nara Lokesh: ‘మీ విధానాలతో 42 వేల పాఠ‌శాల‌లు 11 వేల‌కు త‌గ్గిపోతాయి’
  • Follow Us :
  • google news
  • dailyhunt

పేద‌పిల్లల‌కు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ‌ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్లల‌కు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠ‌శాల‌ల ప్రారంభం రోజునే ల‌క్షలాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు ప్రభుత్వ నిర్ణయం శ‌రాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగ‌మేఘాల‌పై జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల కొర‌త‌, అర‌కొర సౌక‌ర్యాల‌తో ప్రభుత్వ విద్యాల‌యాలు కునరిల్లుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాల‌ల విలీన నిర్ణయం మూలిగే న‌క్కపై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైందన్నారు.

జాతీయ విద్యా విధానం అమ‌లును ఇంకా ఏ రాష్ట్రం మొదలు పెట్టకుండానే ఏపీలో ప్రారంభించేశారని.. స‌మ‌స్యల‌పై ఎటువంటి అధ్యయ‌నం లేకుండా మ‌న‌ రాష్ట్రంలో ఆరంభించ‌డం వల్ల బ‌డికి దూర‌మైన విద్యార్థులు రోడ్డున ప‌డ‌టం చూశామని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్ఈపీ సూచ‌న‌ల మేర‌కు క‌రిక్యులమ్, బోధ‌నా విధానాలు అమ‌లు కోస‌మే పాఠ‌శాల విద్యను నాలుగు స్థాయిలుగా విభ‌జించారన్నారు. అయితే పాఠ‌శాల‌ల‌ను విభ‌జించాల్సిన అవ‌స‌రంలేద‌ని కేంద్రం స్పష్టం చేసినా ప‌ట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శలు చేశారు. పాఠ‌శాల‌ల‌ను విభ‌జించ‌డంతో స‌మ‌స్య తీవ్రమైందని.. జాతీయ విద్యావిధానం అమ‌లు చేసే తొంద‌ర కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ను త‌గ్గించే ఆతృత ప్రభుత్వంలో క‌నిపిస్తోందన్నారు.
Sajjala: రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్ ఎవరికి? వెంకయ్య ఉంటేనే మద్దతిస్తారా?
Read Also:

మ‌రోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన‌ 117 జీవో అమ‌లు వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్దీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్రభుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయన్నారు. దివేందుకు ఇంటికి ద‌గ్గర‌లో ఉన్న బ‌డినే తీసేయ‌డం పేదవారిని చ‌దువుకు దూరం చేయ‌డ‌మే అవుతుందన్నారు. 2 కిలోమీటర్ల పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోను, హైస్కూళ్లలోనూ కలపటంవల్ల ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్పత్తి పూర్తిగా పెరిగిపోయిందన్నారు. హెడ్‌మాస్టర్, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించ‌క‌పోవ‌డం విద్యార్థుల శారీరక మాన‌సిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.

పిల్లల‌కి పాఠ‌శాల‌లు ఒక కిలోమీట‌రు దూరంలోపే ఉండాల‌ని విద్యావిధానాలు చెబుతుంటే ప్రభుత్వం ఏకంగా 3 కిలోమీట‌ర్ల దూరానికి పాఠ‌శాల‌లు త‌ర‌లించ‌డం ప్రభుత్వ విద్యను పేద‌ల‌కి దూరం చేయ‌డ‌మేనని లోకేష్ ఆరోపించారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేష‌న‌లైజేష‌న్ పేరుతో నియంతృత్వ పోక‌డ‌ల‌తో అమ‌లు చేస్తోన్న ఈ విద్యావిధానం వ‌ల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్యత్తులో 11 వేల‌కు త‌గ్గిపోతాయన్నారు. రేష‌న‌లైజేష‌న్ విధానంవల్ల మొత్తం 55 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావ‌డం విద్యా వ్యవ‌స్థకే మ‌ర‌ణ‌ శాస‌నం లాంటిదన్నారు. మ‌రో ప‌దేళ్లపాటు డీఎస్సీ కూడా వేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో టీచ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటున్న ల‌క్షలాది మంది ఆశ‌లు ఆవిరి చేయ‌డం దారుణమని లోకేష్ విమర్శలు చేశారు. త‌ల్లిదండ్రులు కూలీ, నాలికి వెళ్తే.. ప్రభుత్వం దూరం చేసిన పాఠ‌శాల‌ల‌కు వాగులు, వంక‌లు దాటి పిల్లలు ఎలా వెళ్లగ‌ల‌రని ప్రశ్నించారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే రాష్ట్రవ్యాప్తంగా త‌మ బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్లలు, త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్కారన్నారు. జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్యయ‌నం లేకుండానే అమ‌లు చేయ‌డంతో 10 వేల స్కూళ్లు మూత‌ప‌డ్డాయన్నారు. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్‌కు రాసిన లేఖలో లోకేష్ కోరారు. పేద‌పిల్లలకు ప్రభుత్వ విద్యని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణయాల‌ని వెన‌క్కి తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • Government schools
  • Nara Lokesh
  • Telugu Desam Party

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions