Nara Lokesh: ఏపీలో జగన్ వైరస్కు చంద్రబాబే వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం నడుస్తోందని.. జగన్తో పాటు పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని లోకేష్ విమర్శించారు. జగన్ టెన్త్ పాస్ అయినా డిగ్రీ ఫెయిల్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వ్యాపార రంగ సంస్థల యజమానులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని.. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే చిరు వ్యాపారులపై దాడులు చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కూడా దాపురించిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా లేవని గుర్తుచేశారు.
Read Also: YSR Nethanna Nestam: ఏపీలో నేతన్నలకు శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24వేలు జమ
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
అటు రాష్ట్రంలో కార్పొరేషన్లు లేవని.. వాటికి ఛైర్మన్లు మాత్రం ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆక్వా రంగాన్ని జగన్రెడ్డి సంక్షోభంలో పడేశాడని.. రాష్ట్రంలో మద్యం తాగితే ఆరు నెలల్లో చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు అని.. మన రాష్ట్ర ఇసుక తమిళనాడు, కర్ణాటకలకు వెళ్తుందని విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చెందాలి కానీ పరిపాలన ఒకే చోట ఉండాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. 8 కోట్లు ఖర్చుపెట్టి సీఎం జగన్ దావోస్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. సిగ్గుతో దక్షిణ భారతదేశంలో బతుకుతున్నామని.. పక్క రాష్ట్రాల వాళ్ళు జగన్ను తుగ్లక్ అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్కు శాశ్వత హాలీడే పలికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైసీపీ ఎంపీల మాదిరి తమ ఎంపీలను ఢిల్లీలో తాకట్టు పెట్టలేదని.. ఏపీలో రోడ్ల గురించి కేటీఆర్, హరీష్రావు, చినజీయర్ స్వామి కూడా విమర్శించారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ వైరస్ను చూసి ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలోకి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చిరు వ్యాపారులపై వైసీపీ వేసిన పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ వైరస్కు వాక్సిన్ చంద్రబాబే అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..