Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.. నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వేయలేదని స్పష్టం చేశారు.
Read Also: File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్ జంపింగ్పై జీవో జారీ
Also Read
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం… వాటిని నిలిపివేశారని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.. కానీ, కుప్పానికి రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు రూ. 65 కోట్లు ఇస్తాం అంటున్నారని ఫైర్ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం అని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా? అని నిలదీశారు.. రాష్ట్రంలో సంక్షేమం కాదు… అందరినీ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు.. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారన్నారు. ఇక, మన నియోజకవర్గం లో కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.. పోలీసులు న్యాయంగా ఉండాలి.., కానీ, మాట్లాడితే ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్న ఆయన.. నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం అని ప్రకటించారు.. అందరూ పన్నులు కడుతున్నారు.. ఇదేమి వైఎస్ జగన్ సొంత సొమ్ము కాదు.. కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!