Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.. నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వేయలేదని స్పష్టం చేశారు.
Read Also: File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్ జంపింగ్పై జీవో జారీ
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం… వాటిని నిలిపివేశారని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.. కానీ, కుప్పానికి రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు రూ. 65 కోట్లు ఇస్తాం అంటున్నారని ఫైర్ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం అని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా? అని నిలదీశారు.. రాష్ట్రంలో సంక్షేమం కాదు… అందరినీ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు.. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారన్నారు. ఇక, మన నియోజకవర్గం లో కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.. పోలీసులు న్యాయంగా ఉండాలి.., కానీ, మాట్లాడితే ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్న ఆయన.. నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం అని ప్రకటించారు.. అందరూ పన్నులు కడుతున్నారు.. ఇదేమి వైఎస్ జగన్ సొంత సొమ్ము కాదు.. కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!