Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.. నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వేయలేదని స్పష్టం చేశారు.
Read Also: File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్ జంపింగ్పై జీవో జారీ
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం… వాటిని నిలిపివేశారని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.. కానీ, కుప్పానికి రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు రూ. 65 కోట్లు ఇస్తాం అంటున్నారని ఫైర్ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం అని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా? అని నిలదీశారు.. రాష్ట్రంలో సంక్షేమం కాదు… అందరినీ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు.. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారన్నారు. ఇక, మన నియోజకవర్గం లో కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.. పోలీసులు న్యాయంగా ఉండాలి.., కానీ, మాట్లాడితే ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్న ఆయన.. నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం అని ప్రకటించారు.. అందరూ పన్నులు కడుతున్నారు.. ఇదేమి వైఎస్ జగన్ సొంత సొమ్ము కాదు.. కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!