Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband For Extramarital Affair In Nandyala: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో.. పక్కా స్కెచ్తో భర్తని చంపింది ఓ మహిళ. తన ప్రియుడి సహకారంతో మరో మహిళను రంగంలోకి దింపి, భర్తకే వల వేసి, ఒక ప్రాంతానికి రప్పించి.. చివరికి భర్తని పొట్టన పెట్టుకుంది. ఆపై తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని నాటకమాడుతూ, కేసుని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భార్యే అసలు హంతకురాలని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్ వెంకటన్న (42)కు భార్య శ్యామల, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. వెంకటన్న మెడికల్ షాపు నిర్వహిస్తుండగా.. భార్య ఇంటివద్దే చీరల వ్యాపారం చేస్తోంది. కొంతకాలం క్రితం శ్యామలకు బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అది వివాహేతర సంబంధంగా మారింది. తన భర్తకు తెలియకుండా కుమారస్వామితో శ్యామల రాసలీలలు గుట్టుగా కొనసాగించింది. అయితే.. వీరి బంధం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఎలాగోలా వెంకన్నకు వీరి బండారం తెలిసింది. ఇక అప్పటి నుంచి వెంకటన్న తన భార్యని వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశాడు. కుమారస్వామికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు.
ICC World Cup Qualifier: వెస్టిండీస్కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్కప్ నుంచి ఔట్
అయితే.. ప్రియుడ్ని వదిలి ఉండలేకపోయిన శ్యామల, అడ్డుగా ఉన్న తన భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుమారస్వామికి చెప్పింది. అప్పుడు వెంకటకన్నను ట్రాప్ చేసి, చంపాలని ప్లాన్ చేశారు. ఒక మహిళని రంగంలోకి దింపారు. ఆమెతో ఫోన్ చేయించి, కుమారస్వామిని ముగ్గులోకి దింపారు. ఈనెల 19న ఆ మహిళతో ఫోన్ చేయించి, భాస్కరాపురం గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్దకు రావాలని వెంకటన్నని పిలిపించారు. దాంతో.. అతడు వెంటనే అక్కడికి బైక్పై వెళ్లాడు. వెంకటన్న ఆ ప్రాంతానికి చేరుకోగానే.. తన నలుగురు స్నేహితులతో కలిసి కుమారస్వామి అతడ్ని చంపేశాడు. వెంకటన్న గొంతుకు బైక్ తీగ బిగించి హతమార్చారు. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోది, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Devulapalli Amar: టీడీపీ 20 ఏళ్లు పాలించినా.. ఎందుకు ఇంకా పేదరికం ఉంది?
ఇలా తన భర్తని చంపించిన తర్వాత.. శ్యామల తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకేమీ ఎరుగనట్టుగా పోలీసుల ముందు నాటకమాడింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే.. శ్యామల మరీ ఓవర్గా ప్రవర్తించడంతో, పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో.. ఆమె కోణం నుంచి కేసుని విచారించడం మొదలుపెట్టగా, శ్యామలనే తన భర్త వెంకటన్నని చంపినట్టు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే చంపేశానని ఒప్పుకుంది. ఆమెతో పాటు కుమారస్వామి, అతని నలుగురి స్నేహితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!