Devulapalli Amar: టీడీపీ 20 ఏళ్లు పాలించినా.. ఎందుకు ఇంకా పేదరికం ఉంది?
Devulapalli Amar Comments On YCP Manifesto: సమాజమే దేవాలయం అని చెప్పిన టీడీపీ 20 సంవత్సరాలు పాలించిందని.. అయినా రాష్ట్రంలో ఎందుకు ఇంకా పేదరికం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రశ్నించారు. పేదవాడి కష్టాలు తీర్చేలా సీఎం జగన్ మేనిఫెస్టో పెట్టారని కొనియాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మేనిఫెస్టో అంటే జగన్’ చర్చా కార్యక్రమానికి దేవులపల్లి అమర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందని.. మరి, 20 ఏళ్లు పాలించిన టీడీపీ ఎందుకు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందని నిలదీశారు.
MT Krishna Babu: 2047 వరకు సికిల్ సెల్ అనీమియా లేకుండా చేయాలన్నదే లక్ష్యం
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్ అని.. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండని చెప్పడానికి చాలా ధైర్యం కావాలని దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. ప్రతీ గడపకు నాయకులు, అధికారులు వెళ్లి.. వారి సమస్యల్ని తెలుసుకుని, వెంటనే పరిష్కరించే వ్యవస్థను జగన్ సృష్టించారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా.. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు.. ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థను రూపొందించిన వ్యక్తి జగన్ అని ప్రశంసించారు. దేశంలో ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేదన్నారు. ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదని.. పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుందని వివరించారు.
AP JAC Amaravati: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!