NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) పరిధిలో ఆంక్షలు విధించారు అధికారులు.. ఇవాళ్టి నుంచి మూడు నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. అంటే.. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు జనసంచారంపై పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పులుల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలమైన జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పులుల సంభోగం, సంతానోత్పత్తికి అత్యంత కీలకమైన కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మానవ సంచారం తగ్గించడం ద్వారా పులులకు అనుకూలమైన సహజ వాతావరణం కల్పించి వాటి సంఖ్య పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ నిబంధనను అమలు చేస్తోంది.
ఈ ఆంక్షలతో ఎన్ఎస్టీఆర్ కోర్ ఏరియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకులకు అనుమతి ఉండదు. మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని ఇష్టకామేశ్వరి ఆలయం, రుద్రకోడూరు, గుండ్లబ్రహ్మేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కోర్ ఏరియాలో నిర్వహించే జంగిల్ సఫారీలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే శ్రీశైలానికి అటవీ మార్గంలో పాదయాత్రగా వెళ్లే భక్తులకు కూడా ఈ మూడు నెలల పాటు ప్రవేశం ఉండదు.
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
అయితే బఫర్ ఏరియాలోని కొన్ని ఎకోటూరిజం కేంద్రాలు యథావిధిగా కొనసాగనున్నాయి. బైర్లూటి, పచ్చర్ల, తుమ్మలబయలు వంటి ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3,727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉంది. 2023 పులుల లెక్కల ప్రకారం ఇక్కడ 75 పులులు ఉండగా, ప్రస్తుతం పులికూనలతో కలిపి వాటి సంఖ్య సుమారు 87కు చేరినట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఈ ఆంక్షలు కీలకమని అధికారులు పేర్కొన్నారు. జనసంచారం తగ్గడం వల్ల పులులు ప్రశాంతంగా సంచరించి సంతానోత్పత్తి ప్రక్రియను సహజంగా కొనసాగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!