Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: నంద్యాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పెట్రోల్ కొరత, మరియు వైసీపీ నేతలపై కేసుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుదోవ పట్టుతోందని ఆరోపించారు. సీఎం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు విమర్శించారు. ఆ జీవోను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ప్రభుత్వానికి అవమానకరమని, సీఎం దీనిపై సిగ్గుపడాలని అన్నారు. అమరావతి నిర్మాణం భారీ స్థాయిలో చేపట్టడం వల్లే సమస్యలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
అమరావతి ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదని, అది తన జన్మలోనే కాదు, సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ జన్మలో కూడా పూర్తికాదని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు… ఈ ప్రాజెక్ట్ పేరిట అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రూ. 75 వేల కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలను దేవుళ్లుగా భావించే సీఎం, తరువాత కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి నారా లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఇక, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తనపై ఇప్పటికే 36 కేసులు నమోదు చేశారని, మరిన్ని కేసులు పెట్టినా కోర్టుకు హాజరవుతానని తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అరెస్టు చేసి ఆటోలో తీసుకెళ్లడం దుర్వినియోగమని విమర్శించారు. కేసుల పేరిట వైసీపీ నేతలను మానసికంగా వేధిస్తున్నారని, విలేకరులపై కూడా దాడులు జరుగుతున్నాయని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు కొందరు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. పోలీసుల వేధింపులు ఆగకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో, శిల్ప రవి మాట్లాడుతూ పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదానీ డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?