Seaplane: శ్రీశైలంలో సేఫ్గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్ రన్ విజయవంతం..
- శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం..
- ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయిన సీ ప్లేన్..
- విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు..
- రేపు ప్రారంభించి.. ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seaplane: టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా సీ ప్లేన్ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ను నడిపేందుకు సిద్ధమైంది.. ఇక, దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతోంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతేకాదు.. విజయవాడ నుంచి సీ ప్లేన్ లో బయల్దేరి.. శ్రీశైలం వరకు ప్రయాణించనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.. దీంతో.. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, పాతాళగంగ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రత బలగాలు..
Read Also: India–Russia Relations: భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
ఇక, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.. శనివారం రోజు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీ ప్లేన్ లాంఛనంగా ప్రారంభించి.. సీ ప్లేన్ లో శ్రీశైలం పాతాళగంగంలో ల్యాండ్కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.. ఇక, అదే సీప్లెన్లో తిరిగి విజయవాడలోని పున్నమి ఘాట్కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!