Seaplane: శ్రీశైలంలో సేఫ్గా ల్యాండ్ అయిన సీ ప్లేన్.. ట్రయల్ రన్ విజయవంతం..
- శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం..
- ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయిన సీ ప్లేన్..
- విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసులు..
- రేపు ప్రారంభించి.. ప్రయాణించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seaplane: టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా సీ ప్లేన్ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది.. విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ను నడిపేందుకు సిద్ధమైంది.. ఇక, దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతోంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతేకాదు.. విజయవాడ నుంచి సీ ప్లేన్ లో బయల్దేరి.. శ్రీశైలం వరకు ప్రయాణించనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.. దీంతో.. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, పాతాళగంగ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రత బలగాలు..
Read Also: India–Russia Relations: భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
ఇక, సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండింగ్, రోప్ వే, రోడ్డు మార్గంలో దర్శనానికి వెళ్లే దారులలో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.. శనివారం రోజు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి సీ ప్లేన్ లాంఛనంగా ప్రారంభించి.. సీ ప్లేన్ లో శ్రీశైలం పాతాళగంగంలో ల్యాండ్కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.. ఇక, అదే సీప్లెన్లో తిరిగి విజయవాడలోని పున్నమి ఘాట్కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!