Nadendla Manohar: బటన్ నొక్కడానికి బారికేడ్లు అవసరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. కుప్పంలో శుక్రవారం నాడు జగన్ పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. కుప్పంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ చర్యలను ఉద్దేశిస్తూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా అని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. మీకు రోడ్లు వేయడం రాదు కానీ… రోడ్లు తవ్వేసి బారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ మేరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#GoodMorningCMSir ఒక్క బటన్ నొక్కాలంటే..
3 వరసల బ్యారికేడ్లు
3 వేలమంది పోలీసులు
3 వేల బస్సులు ఉండాలా @ysjagan గారూ? మీకు రోడ్లు వేయడం రాదుగానీ, రోడ్డు తవ్వేసి బ్యారికేడ్లు వేస్తున్నారు. pic.twitter.com/Hbbus9tf2rAlso Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
— Manohar Nadendla (@mnadendla) September 23, 2022
కాగా అటు కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు శుక్రవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన శ్రీనివాసులు, రాజ్ కుమార్, మునుస్వామిలతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఏడుగురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున బాండ్, ఇద్దరేసి వ్యక్తుల పూచీకత్తులు సమర్పించి బెయిల్ పొందవచ్చని హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!