Nadendla Manohar: బటన్ నొక్కడానికి బారికేడ్లు అవసరమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. కుప్పంలో శుక్రవారం నాడు జగన్ పర్యటన సందర్భంగా అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. కుప్పంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ చర్యలను ఉద్దేశిస్తూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా అని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. మీకు రోడ్లు వేయడం రాదు కానీ… రోడ్లు తవ్వేసి బారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ మేరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#GoodMorningCMSir ఒక్క బటన్ నొక్కాలంటే..
3 వరసల బ్యారికేడ్లు
3 వేలమంది పోలీసులు
3 వేల బస్సులు ఉండాలా @ysjagan గారూ? మీకు రోడ్లు వేయడం రాదుగానీ, రోడ్డు తవ్వేసి బ్యారికేడ్లు వేస్తున్నారు. pic.twitter.com/Hbbus9tf2rAlso Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
— Manohar Nadendla (@mnadendla) September 23, 2022
కాగా అటు కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు శుక్రవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన శ్రీనివాసులు, రాజ్ కుమార్, మునుస్వామిలతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఏడుగురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున బాండ్, ఇద్దరేసి వ్యక్తుల పూచీకత్తులు సమర్పించి బెయిల్ పొందవచ్చని హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!