MP Avinash Reddy: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్కి ఎంపీ అవినాష్ లేఖ.. ఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు
MP Avinash Reddy Wrote Letter To CBI Director Praveen Sood About Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు లేఖ రాశారు. గతంలో వివేకా హత్య కేసుని విచారించిన ఎస్పీ రామ్సింగ్పై ఆయన ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసుని రామ్సింగ్ దర్యాప్తు చేశారని ఆ లేఖలో ఆరోపించారు. రామ్సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ ఆధారంగా లేఖ రాసిన అవినాష్రెడ్డి.. అందులో వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను ప్రస్తావించారు.
Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
దస్తగిరి చెప్పిన నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్సింగ్ ఈ కేసు విచారణ జరిపారని అవినాష్రెడ్డి తెలిపారు. అసలు విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే.. నిబంధనలకు వ్యతిరేకంగా రామ్సింగ్ విచారణ జరిపారన్నారు. తనతో పాటు తన తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిలను ఇరికించేందుకు సాక్ష్యుల్ని రామ్సింగ్ బెదిరించారని.. ఆయన వేధింపులు భరించలేకే పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ ఇద్దరూ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారని అన్నారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను సైతం రామ్సింగ్ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నా.. సీబీఐ అతడ్ని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందన్నారు. వివేకా హత్య కేసులో తానిచ్చిన వాంగ్మూలాన్ని రామ్సింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్రెడ్డి మీడియా ముందు చెప్పారని గుర్తు చేశారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కన పెట్టిందని అవినాష్ ఆ లేఖలో పేర్కొన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాల్ని ఎత్తుకెళ్లడానికే ఈ హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో రామ్సింగ్ చేసిన తప్పుల్ని సవరించాలని చెప్పిన అవినాష్రెడ్డి.. అసలైన నేరస్తుల్ని పట్టుకొని, న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ను కోరారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!