MP Avinash Reddy: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్కి ఎంపీ అవినాష్ లేఖ.. ఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Avinash Reddy Wrote Letter To CBI Director Praveen Sood About Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు లేఖ రాశారు. గతంలో వివేకా హత్య కేసుని విచారించిన ఎస్పీ రామ్సింగ్పై ఆయన ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసుని రామ్సింగ్ దర్యాప్తు చేశారని ఆ లేఖలో ఆరోపించారు. రామ్సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ ఆధారంగా లేఖ రాసిన అవినాష్రెడ్డి.. అందులో వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను ప్రస్తావించారు.
Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
Also Read
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
- CM Chandrababu Naidu: 'సీమలో సీన్ మారింది'.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
- Saikrishna Case: "నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే.." సాయికృష్ణ తల్లి ఆవేదన
దస్తగిరి చెప్పిన నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్సింగ్ ఈ కేసు విచారణ జరిపారని అవినాష్రెడ్డి తెలిపారు. అసలు విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే.. నిబంధనలకు వ్యతిరేకంగా రామ్సింగ్ విచారణ జరిపారన్నారు. తనతో పాటు తన తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిలను ఇరికించేందుకు సాక్ష్యుల్ని రామ్సింగ్ బెదిరించారని.. ఆయన వేధింపులు భరించలేకే పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ ఇద్దరూ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారని అన్నారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను సైతం రామ్సింగ్ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నా.. సీబీఐ అతడ్ని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందన్నారు. వివేకా హత్య కేసులో తానిచ్చిన వాంగ్మూలాన్ని రామ్సింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్రెడ్డి మీడియా ముందు చెప్పారని గుర్తు చేశారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కన పెట్టిందని అవినాష్ ఆ లేఖలో పేర్కొన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాల్ని ఎత్తుకెళ్లడానికే ఈ హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో రామ్సింగ్ చేసిన తప్పుల్ని సవరించాలని చెప్పిన అవినాష్రెడ్డి.. అసలైన నేరస్తుల్ని పట్టుకొని, న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ను కోరారు.
తాజావార్తలు
-
Venky Anil5 : ఆ సినిమా రీమేక్ కాదు.. కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు
-
Kapil Dev: “వైభవ్లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
-
American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..