MP Avinash Reddy: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్కి ఎంపీ అవినాష్ లేఖ.. ఎస్పీ రామ్సింగ్పై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Avinash Reddy Wrote Letter To CBI Director Praveen Sood About Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు లేఖ రాశారు. గతంలో వివేకా హత్య కేసుని విచారించిన ఎస్పీ రామ్సింగ్పై ఆయన ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో వివేకా హత్య కేసుని రామ్సింగ్ దర్యాప్తు చేశారని ఆ లేఖలో ఆరోపించారు. రామ్సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ ఆధారంగా లేఖ రాసిన అవినాష్రెడ్డి.. అందులో వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను ప్రస్తావించారు.
Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
Also Read
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
దస్తగిరి చెప్పిన నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్సింగ్ ఈ కేసు విచారణ జరిపారని అవినాష్రెడ్డి తెలిపారు. అసలు విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే.. నిబంధనలకు వ్యతిరేకంగా రామ్సింగ్ విచారణ జరిపారన్నారు. తనతో పాటు తన తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిలను ఇరికించేందుకు సాక్ష్యుల్ని రామ్సింగ్ బెదిరించారని.. ఆయన వేధింపులు భరించలేకే పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ ఇద్దరూ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారని అన్నారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను సైతం రామ్సింగ్ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నా.. సీబీఐ అతడ్ని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందన్నారు. వివేకా హత్య కేసులో తానిచ్చిన వాంగ్మూలాన్ని రామ్సింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్రెడ్డి మీడియా ముందు చెప్పారని గుర్తు చేశారు.
Health Tips : రోజూ రాత్రి ఒక లవంగాన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కన పెట్టిందని అవినాష్ ఆ లేఖలో పేర్కొన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాల్ని ఎత్తుకెళ్లడానికే ఈ హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో రామ్సింగ్ చేసిన తప్పుల్ని సవరించాలని చెప్పిన అవినాష్రెడ్డి.. అసలైన నేరస్తుల్ని పట్టుకొని, న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ను కోరారు.
తాజావార్తలు
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!