Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Killed After Molested By Two Boys In Krishna District: కృష్ణా జిల్లాలోని పామర్రులో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక మౌనశ్రీ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 20న పాఠశాలకు వెళ్లి, ఆదివారం సాయంత్రం కాలువలో శవమై తేలిన ఆ బాలికపై ఇద్దరు అత్యాచారం చేసినట్టు గుర్తించారు. కొండిపరు గ్రామానికి చెందిన చిల్లిముంత లోకేష్, లంక నరేంద్ర అనే ఇద్దరు యువకులు.. ఆ మైనర్ బాలికని ఉయ్యూరు లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో తేలింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడిందా? లేక వాళ్లిద్దరు హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక తల్లి వాణి తన కూతురి మృతదేహాన్ని చూసి రోధిస్తూ.. సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Kannada Actresses: మొన్న సౌందర్య.. నేడు జగతి.. భర్తలను వదిలి.. వారితో ఎఫైర్.. ?
Also Read
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక మౌనశ్రీ పామర్రు మండలంలోని నిమ్మకూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి ఈ బాలికతో లోకేష్ అనే యువకుడు చాటింగ్ చేస్తున్నాడు. ఎప్పట్లాగే ఈనెల 20వ తేదీన ఆమె స్కూలుకి బయలుదేరగా.. లోకేష్ ఆమెకు మాయమాటలు చెప్పి, ఉయ్యూరులో ఉన్న లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ లోకేష్తో పాటు అతని సోదరుడు నరేంద్ర కలిసి.. ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం లోకేష్ ఆ బాలికని గ్రామం వద్ద దింపేసి వెళ్లిపోయాడు. అటు.. స్కూలుకి వెళ్లిన మౌనశ్రీ సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. నేడు సాయంత్రం మొవ్వ మండలం మంత్రిపాలెం కాల్వలో బాలిక మృతదేహం కనిపించింది. కేసుని సీరియస్గా తీసుకుని విచారించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. వారిపై తాము రౌడీ షీట్లు తెరుస్తామని కృష్ణా ఎస్పీ జాషువా తెలిపారు.
UP Minister: టమాటా తినడం మానేయండి.. అధిక ధరలపై యూపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?